మాస్ ప్రేక్షకుల పల్స్ బాగా తెలిసిన దర్శకుడు ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు బోయపాటి శీను. ఆయన సినిమాలన్నీ మాస్ కాదు ఊర మాస్ అన్నట్లుగా వుంటాయి. ఇక ఈ సినిమాలో హీరోఇజం గురుంచి చెప్పాలంటే..  అబ్బో అది మాటల్లో చెప్పలేనిది. అయితే ఇలాంటి మాస్ డైరెక్టర్ కు సరిగ్గా సరిపోయే హీరో ఎవరు అంటే బాలకృష్ణ అని చెప్పాలి. గతంలో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో  సింహ లెజెండ్ లాంటి సినిమాలు వచ్చి  మంచి విజయాలు అందుకున్నాయి. మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను... మాస్ యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణ తో అదిరిపోయే సినిమా తెరకెక్కిస్తే మాస్ ప్రేక్షకులు అందరికీ పండగే అని చెప్పాలి. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా పై  రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 

 

 

 అయితే ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలో కనిపించనున్నట్లు టాక్  వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఒకటి అగోర పాత్ర అయితే ఇంకొకటి స్టైలిష్ గా కనిపించే పాత్రలో  బాలకృష్ణ కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా పై ఎన్నో వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ ను  వెతికి పెట్టేందుకు బోయపాటి శ్రీను తీవ్ర కసరత్తులు చేస్తున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమాలో శ్రియ నయనతార లను  హీరోయిన్లుగా తీసుకోవాలని భావించిన వారిద్దరూ ఈ సినిమాకు నో చెప్పడంతో ప్రస్తుతం ఎవరిని ఎంచుకోవాలో అనే దానిపై బోయపాటి ఆలోచిస్తున్నారట. 

 

 

 ఈ క్రమంలోనే బాలయ్య సరసన అంజలి నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య సరసన అంజలి నటించిన రెండవ సినిమా కానుంది ఈ సినిమా. గతంలో డిక్టేటర్ చిత్రంలో బాలకృష్ణ సరసన నటించింది అంజలి. ఇక మరో హీరోయిన్ ఎవరు అనే దానిపై కూడా సస్పెన్స్ నెలకొంది. అయితే మరో హీరోయిన్ గా సోనాక్షి చౌహాన్ ను సెలెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోనాక్షి చౌహన్  సింహా లెజెండ్ సినిమాలో నటించింది.. ఇక ఇప్పుడు నటిస్తే ముచ్చటగా మూడోసారి బాలయ్య సరసన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్టు వర్కు పూర్తి అవగా హీరోయిన్ల సెలక్షన్ పూర్తవ్వగానే... ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్ వారణాసిలో జరగనున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: