విజయ్ దేవరకొండ హీరో గా ఇటీవల వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోరమైన డిజాస్టర్ అయ్యింది. మూడు వరుస ఫ్లాపుల తర్వాత విజయ్ దేవరకొండ నలుగురు హీరోయిన్లతో నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. తీరా సినిమా రిలీజయ్యాక తొలి ఆట నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో భారీ నష్టాలు తప్పలేదు. ఇక సినిమా ప్రమోషన్లో సైతం హీరో విజయ్ దేవరకొండ గాలికి వదిలేశాడు. అటు డైరెక్టర్ క్రాంతి మాధవ్ హీరో విజయ్ ఈ సినిమాలో విపరీతంగా జోక్యం చేసుకోవడం వల్లే సినిమా అన్నట్టు లీకులు బయటకు వచ్చాయి. అయితే టాలీవుడ్ లో ఒక్క విజయ్ దేవరకొండ మాత్రమే కాదు చాలా మంది స్టార్ హీరోలు సైతం డైరెక్టర్లను తమ పని తాము చేసుకోనివ్వకుండా ఇష్టం వచ్చినట్టు కథను కెలికేసి డైరెక్షన్ లో నీళ్లు పెట్టేసి సినిమాను చిందరవందర చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.

 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలలో యువరత్న నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే ఒకసారి కథ విన్నాక ఆ తర్వాత ఎట్టి  పరిస్థితుల్లోనూ కథలో కానీ డైరెక్షన్ లో కానీ జోక్యం చేసుకోవాలని అనుకోరు. దర్శకుడు ఎలా చెబితే అలా చేసుకుంటూ వెళ్లిపోతారని ఈ ఇద్దరి హీరోలకు మంచి ప్రశంసలు ఉన్నాయి. ఇక మిగిలిన హీరోలందరూ కథలో వేళ్ళు పెట్టేసి ఇష్టమొచ్చినట్టు చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. అంతెందుకు ఇండస్ట్రీలో ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరోలు అయితే కథ చెప్పినప్పటి నుంచి  సినిమా షూటింగ్ ముగిసే వరకు కూడా కథలో వేలుపెట్టి ఇష్టమొచ్చినట్టు చేయడంతో పాటు దర్శకుడికి చుక్కలు చూపించేస్తారన్న టాక్ ఉండనే ఉంది. 

 

ఇక మరో స్టార్ హీరో సైతం అప్పుడప్పుడు డైరెక్షన్ లో వేలు పెడతారని అందుకే ఆయన నటించిన రెండు సినిమాలు కూడా ఆయన విమర్శలు ఉన్నాయి. హీరోలు దర్శకుల పనిలో వేలు పెట్టడం తో ఎన్నో సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక దర్శకుల నుంచి ఫ్లాపుల్లో ఉన్న ద‌ర్శ‌కులు వరకు ఇబ్బందులు తప్పటం లేదు. రాజమౌళి కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు ఏం చెబితే అదే నడుస్తుంది. ఇక మిగిలిన అందరూ హీరోల దెబ్బకు బలికాక త‌ప్ప‌డం లేదు. మరి ఈ పరిస్థితిలుఎప్పుడు మారుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: