టాలీవుడ్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వరుసగా సినిమాలు చేయకపోయినా చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే పవన్ కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ స్టార్ వారసుడికి కూడా ఈ రేంజ్ లో పాపులారిటి లేదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రస్తుతం ఫాలోయింగ్ లో పవన్ కళ్యాణ్ ని మించిన హీరో లేడు అనేది వాస్తవం. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే ఆయన ఫాన్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు అనే చెప్పాలి.

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన్ను హీరోలు హీరోయిన్లు బాగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు కూడా పవన్ కళ్యాణ్ ని ఆయన ఫాలోయింగ్ ని బాగానే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నితిన్ హీరోగా వచ్చిన సినిమా భీష్మ విషయంలో కూడా ఆయన్ను వాడుకునే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా రష్మిక మంధనా అయితే పవన్ కళ్యాణ్ పేరుని పలు మార్లు ప్రస్తావించి ఆశ్చర్యపరిచింది. ఒక ఇంటర్వ్యులో భాగంగా ఆమె పవన్ కళ్యాణ్ పేరుని పలు మార్లు ప్రస్తావించింది. 

 

దీనితో పవన్ ఫాన్స్ కూడా ఈ సినిమాను ఎక్కువగానే చూసారని అంటున్నారు. అందుకే వసూళ్లు కూడా నితిన్ కెరీర్ లో లేని విధంగా తొలి రోజు సాధించారు అంటున్నారు. నితిన్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమాని ఆ విషయ౦ ఆమె ప్రత్యేకంగా చెప్పింది. దీనికి తోడు నితిన్ ఫ్యాన్ బాయ్ అంటూ మాట్లాడింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ని ఆమె సమర్ధవంతంగా వాడుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె చేసిన వ్యాఖ్యలకు మంచి ప్రాధాన్యత వచ్చింది. ఇలా రష్మిక పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఈ విధంగా వాడుకుంది అన్నమాట. ఆయన ఫాన్స్ కూడా ఆమెను అభిమానించడం పాపకు కలిసి వచ్చే అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: