ఈ మద్య కొన్ని ఎయిర్ ఇండియా సంస్థలు చేస్తున్న అతి వల్ల సెలబ్రెటీలు అవమానం పొందుతున్నారు.. వారు చేస్తున్న నిర్ల క్ష్యం వల్ల సోషల్ మీడియాల సాక్షిగా ఫైర్ అవుతున్నారు.  తాజాగా మోడల్, నటి కృతి కర్భందా ఎయిర్ ఇండియాపై చిర్రెత్తుకొచ్చి ఫైర్ అయ్యింది.   ప్రియ‌మైన ఎయిరిండియా..మ‌రోసారి నా ల‌గేజీని మిస్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు. మీ సిబ్బందికి ప్ర‌యాణీకుల‌తో ఎలా ప్ర‌వ‌ర్తించాలో నేర్పించండి అంటూ  సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  దాంతో వెంటనే స్పందించిన ఎయిర్ ఇండియా సంస్థ వారు ‘మా క్షమాపణలు తెలియజేస్తున్నాం.

 

మీ ఫ్లైట్ నెంబర్, లగేజీ ట్యాగ్ నెంబర్ వివరాలను తెలియజేయండి’ అని రిప్ల‌య్ ఇచ్చింది. కృతి స‌మాధానం చెబుతూ ‘‘మీ క్షమాపణలు అంగీకరించాలనే ఉంది. కానీ నా లగేజీకి సంబంధించిన సమాచారమేదీ తెలియడం లేదు. ముంబై, గోవా సిబ్బంది నా లగేజీ ఎక్కడుందో చెప్పలేకపోయాయి’’ అన్నారు. మరిప్పుడు ఎయిరిండియా ఎలాంటి దిద్దుబాటు చ‌ర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.  అసలు విషయానికి వస్తే ప్రముఖ విమాన‌యాన సంస్థ ఎయిరిండియాలో కృతి ల‌గేజీ మిస్ అయ్యింది. దాంతో ఇంత పెద్ద విమాన సంస్థ చిన్న లగేజ్ విషయంలో ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా అని ఈ నటి ఆవేదన వ్యక్తం చేసింది. 

 

తెలుగులో ప‌వ‌న్ స‌ర‌స‌న తీన్‌మార్‌, బ్రూస్‌లీ, బోణీ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ కృతి క‌ర్భందా. ప్ర‌స్తుతం ప‌ర భాషా మూవీల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.  తాజాగా కృతి క‌ర్భందా పోస్టులకు ఇతర సెలబ్రెటీలు కూడా స్పందిస్తూ గతంలో తమకు ఇలాంటి అనుభవాలే ఎదురుయ్యాయని.. సెలబ్రెటీల విషయంలో ఇలా జరిగితే సామాన్యుల విషయం ఏంటీ అని అడుగుతున్నారు.  వారికి అనుకూలంగా ఏదీ లేకున్నా నానా రకాల పరీక్షలు చేస్తుంటారు.. మరి కస్టమర్ల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  మరి దీనిపై సోషల్ మీడియాలో ఇంకెన్ని కామెంట్స్ వినిపిస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: