టాలీవుడ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్. తనదైన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించగల సత్తా  దేవిశ్రీ సొంతం అని చెప్పాలి. ఎలాంటి లిరిక్  నైనా తనదైన రీతిలో రిథమ్ యాడ్  చేసి.. స్వరాలకు సరికొత్త  రూపం తీసుకొస్తాడు దేవిశ్రీప్రసాద్. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఎన్నో పాటలు ఎవర్ గ్రీన్ గా కూడా నిలిచాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దేవిశ్రీ పాటలు కంపోజ్ చేస్తూ ఉంటాడు. దేవిశ్రీ కేవలం  మ్యూజిక్ డైరెక్టరేనా..  అంటే అస్సలు కాదు అనే చెప్పాలి.... దేవిశ్రీ ఒక రాక్ స్టార్... అదిరిపోయే పాటలు పాడాలి అన్న స్టేజ్ మీద డాన్స్ తో అదరకొట్టాలి అన్న ... మరోవైపు యాంకరింగ్ చేయాలి అన్న అది దేవిశ్రీ ఒక్కడికే సాధ్యం అని చెప్పాలి. 

 

 

 ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.. ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని కూడా చూరగొన్నారు . ఇక మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా దేవిశ్రీ తన దైన మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు అనే చెప్పాలి. ఇప్పటికి దేవిశ్రీ అందించిన పాటలు ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి . శ్రీకర్ స్టార్ హీరోల సినిమాల్లోనే కాదు చిన్న హీరోల సినిమాల్లో కూడా... సంగీత దర్శకుడిగా ఎంతో అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే వుంటారు దేవి శ్రీ ప్రసాద్. ఇకపోతే తాజాగా మ్యూజిక్   డైరెక్టర్ దేవిశ్రీ ఓ  ఇంటర్వ్యూకు హాజరవ్వగా..  అక్కడ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

 

 

 తనకు సాగరసంగమం లాంటి నృత్య ప్రధాన సినిమాలు చేయాలని ఉంటుంది అంటూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. అప్పటికీ ఇప్పటికీ తాను మెచ్చిన చిత్రం సాగరసంగమం అంటూ పేర్కొన్నారు స్వరాల మాంత్రికుడు. ప్రపంచంలో డాన్స్ నేపథ్యంలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో  సాగరసంగమం కూడా ఉంటుంది అంటూ దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. ఆ సినిమాను మించిన సినిమా మరొకటి రాదు అంటూ తెలిపిన దేవిశ్రీప్రసాద్ అంతటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కె.విశ్వనాథ్ ఎక్కడ కనిపించినా అన్ని సార్లు కాళ్లపై పడి నమస్కరిస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: