కోలీవుడ్ సినిమా మదరాసి పట్నం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్రిటీష్ బ్యూటీ ఎమీ జాక్సన్. తొలి సినిమాలోనే అందరిని తన అందంతో మాయలో పడేసిన ఈ బ్యూటీ తరువాత బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. తెలుగులో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఎవడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ తన గ్లామర్తో అందరిని ఆకట్టుకుంది. 2009లో మిస్ టీన్ వరల్డ్గా నిలిచిన ఈ బ్యూటీ పలు హాలీవుడ్ ప్రాజెక్ట్స్లోనూ తళుక్కుమంది.
గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఐ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ స్టార్గా మారిన ఈ బ్యూటీ ఆ సినిమా ఫెయిల్ కావటంతో నిరుత్సాహపడింది. తరువాత అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిన 2.ఓతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బ్రిటీష్ బ్యూటీ. గత ఏడాది జనవరిలో తాను జార్జ్ అనే వ్యక్తితో డేటింగ్లో ఉన్నట్టుగా ప్రకటించిన ఎమీ, గత ఏడాది మేలో నిశ్చితార్థం జరుపుకుంది. సెప్టెంబర్లో వీరు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
అయితే తరువాత కొంత కాలం గ్లామర్ ఫీల్డ్కు దూరంగా ఉన్న ఎమీ, ఇప్పుడిప్పుడే తిరిగి ర్యాంప్ షోలతో బిజీ అవుతోంది. ఈ మధ్యే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయిన ఈ భామ, వరుసగా ఫోటో షూట్లతో అలరిస్తోంది. అమ్మ అయిన తరువాత కూడా తరగని అందంతో అందరితో ఔరా అనిపిస్తోంది ఈ భామ.