మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఎవరన్నది కూడా ఫైనలైజ్ కాలేదు. కొణిదెల ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామ్చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.
ఇక ఈ సినిమాకు ఆచార్య అని రకరకాల టైటిల్స్ వినిపిస్తున్నా చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఇక ఈ సినిమాలో చిరు పూర్తిగా కొత్త గెటప్లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో చిరు ముందుగా ఆచార్యుడిగా కనిపిస్తాడన్న టాక్ వచ్చింది. ఇక తాజాగా రిలీజ్ అయిన లుక్ చూస్తే చిరు ఎర్ర తువ్వాలు మొడలో వేసుకుని ఉండడంతో నక్సలైట్ అంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ లీక్ వినాయక్ హీరోగా దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కుతోన్న శీనయ్య లుక్ను అచ్చు గుద్దినట్టు ఉంది. ఈ రెండు లుక్లో ఒకేలా ఉన్నాయి. దీంతో ఈ రెండు లుక్లను కంపేరిజన్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు. వినాయక్ చేస్తున్న శీనయ్య, చిరు కొత్త లుక్లను పక్కనబెట్టి చూస్తే ఈ సందేహం ఎవరికైనా వస్తుంది.
శీనయ్య లుక్నే అచ్చు గుద్దినట్టు దించేసిన చిరు చివరకు ఎలాంటి హిట్ అందుకుంటాడా ? అన్న డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. లుక్తోనే రిజల్ట్ అంచనా వేయలేకపోయినా.. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక అవాంతరాలు ఎదుర్కొంటోంది. ఇప్పటకీ హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. కొరటాలపై చిరు అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.