మోహన్‌ బాబు కుమార్తె అయిన మంచులక్ష్మి చాలాకాలంగా శాటిలైట్ ఛానెల్స్ కోసం అనేక టాక్ షోస్ చేసింది, చేస్తుంది కూడా. ఇదే కాకుండా అనేక సినిమాలు సైతం ప్రొడ్యూస్ చేయడమే కాకుండా నటించింది కూడా.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.. ఇదే కాకుండా మంచు లక్ష్మి డిజిటల్ మీడియాలో కూడా ప్రవేశించింది.

 

 

ఇక మంచు లక్ష్మికి స్వతహగా భక్తి ఎక్కువ. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించింది.. తన జీవితాన్ని క్రమశిక్షణతో గడపడంలో లక్ష్మి ఎప్పుడు ముందుంటుందని అంటారు.. ఇక ప్రస్తుతం మంచు లక్ష్మీ ప్రసన్న నటిగానే కాదు.. యాంకర్‌, నిర్మాతగానూ రాణిస్తున్నారు. చిత్రపరిశ్రమలో ఉన్న ప్రతి నటీనటులతో మంచు లక్ష్మికి గుడ్ రిలేషన్ ఉంది.. ఇక తొలి రోజుల్లో ఆమె కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కుమార్తెగా పరిచయమైనప్పటికీ అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తానేంటో నిరూపించుకున్నారు..

 

 

ఇక ఓ ఇంటర్వ్యూ లో మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నది. గుడికి ఎప్పుడైనా వెళ్తుంటారా అని అడిగితే..... చాలా తక్కువ కానీ, తిరుమలకు మాత్రం వెళ్తుంటా.. చిన్నప్పటి నుంచి తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లడం ఇష్టం. అక్కడికి వెళ్తే మా పెదనాన్న దగ్గరకు వెళ్లినట్లు ఉంటుంది అని కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు.

 

 

కొంతమంది సెటైరికల్ గా ఇంకేమనిపిస్తుంది అని ప్రశ్నిస్తుండగా, మరికొందరు.... మళ్ళీ వచ్చావా అంటూ కామెంట్ చేస్తున్నారు... ఏమండి ఏదో తన మనసులో భగవంతును పై భక్తితో అలా చెప్పి ఉండవచ్చూ. అంతే కాని ఇది సీరియస్‌గా తీసుకోవలసిన విషయం కాదని మరికొందరు అనుకుంటున్నారట.. ఏది ఏమైనా సెలబ్రేటీలు చిన్న మాట మాట్లాడినా దాన్ని భూతద్దంలో పెట్టి చూడటం మనకు అలవాటుగా మారింది.. ఒకరకంగా వారి స్వేచ్చను భంగపరుస్తున్నటే అని ఎందుకు ఆలోచించరో అభిమానులు...

మరింత సమాచారం తెలుసుకోండి: