సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పరిస్థితిని బట్టి మారిపోతూంటాయి. ఒకరితో చేయాల్సిన సినిమాలు మరొకరితో.. ఒకరితో ప్రారంభం కావాల్సిన సినిమా వాయిదా పడడం.. హిట్, ఫ్లాప్ ట్రాక్ ను బట్టి అవకాశాలు మారడం.. వంటి కారణాలతో సినిమా అవకాశాలు అటు ఇటూ అవుతూంటాయి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఒకటి జరుగబోతోందని ఫిలింనగర్లో వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలకు సంబంధించిన వారందరూ ప్రస్తుతానికి సైలెన్స్ మెయింటైన్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఈ కన్ఫ్యూజన్ అంతా మహేశ్ బాబు – వంశీ పైడిపల్లి, నాగ చైతన్య – పరశురామ్ సినిమాల గురించే.

 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం వంశీ పైడిపల్లితో మహేశ్ చేయాల్సిన సినిమా ఆగిపోయిందనే. ఈ గ్యాప్ ను గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో సినిమా చేయాలని మహేశ్ ఫిక్స్ అయ్యాడని కూడా ఓ వార్త రౌండ్ అవుతుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. నాగచైతన్యతో పరశురామ్ సినిమా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. గత డిసెంబర్ లో ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ సినిమాకు నాగేశ్వర రావు అనే టైటిల్ అనుకుంటున్నారని కూడా ప్రచారంలో ఉంది. శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ పూర్తి చేసి నాగచైతన్యసినిమా మొదలుపెడతారని కూడా ప్రచారంలో ఉంది.

 

 

కానీ.. ఈగ్యాప్ లో మహేశ్ సినిమా వంశీతో ఆగిపోవడం నాగచైతన్యకు ఇబ్బందిగా మారేట్టుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేశ్ వంటి సూపర్ స్టార్ సినిమా చేద్దామంటే ఏ దర్శకుడికైనా లక్కీగా ఫీలవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరశురామ్ కి ఇది సంకట స్థతి అనే చెప్పాలి. ఈ వార్తపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇదే నిజమైతే పరశురామ్ ఏం చస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: