ఒకప్పటితో పోలిస్తే ప్రస్తతం ఇంటర్నెట్ వినియోగం మరింతగా ఎక్కువ అవడం జరిగింది. ముందుగా నాలుగేళ్ళ క్రితం జియో రంగప్రవేశం తరువాత ఇంటర్నెట్ ధరలు పూర్తిగా సామాన్యుడికి అందుబాటులోకి రావడంతో మనలో చాలా మంది ఇంటర్నెట్ ని వినియోగించడం మొదలెట్టారు. ఇక అక్కడి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాలు మరింతగా ఊపందుకున్నాయి. ఇక కొన్ని రకాల వార్తలు అయితే అసలు నిజమే కాదో అని నమ్మే లోపే ఎంతో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిన తరువాత నుండి పలువురు హీరోల అభిమానులు అయితే ఏకంగా పలు ట్రెండ్స్ పేరుతో ట్విట్టర్ వంటి మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. 

 

ఎవరైనా హీరో లేదా హీరోయిన్ పుట్టినరోజు, కొత్త సినిమా రిలీజ్, పెళ్లి వేడుక వంటి వాటికి ఆయా హీరో, హీరోయిన్ల ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ట్రెండ్స్ సెట్ చేస్తూ వాటిని వైరల్ చేయడం అలవాటైపోయింది. ఇకపోతే నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, తమ హీరో నటిస్తున్న తాజా సినిమా లాయర్ సాబ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చి తీరాలని, ఈ విషయమై నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ ఇంకా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో అర్ధం కావడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. 

 

మొన్నటి జానూ సినిమా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, పవన్ పింక్ రీమేక్ అయిన లాయర్ సాబ్ సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పిన దిల్ రాజు, మరికొద్దిరోజుల్లో మార్చి కూడా రాబోతుండడంతో కనీసం సినిమాకు సంబంధించి ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వకపోవడం శోచనీయమని, కావున ఇకనైనా సినిమా యూనిట్ తమ హీరో సినిమా విషయమై ఒక చిన్న అప్ డేట్ ఇస్తే బాగుంటుందని వారు ట్విట్టర్ వేదికగా #wewantPSPK26update పేరుతో ఒక ట్రెండ్ ని పరిగెత్తిస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే 30కె ట్వీట్స్ వరకు చేరుకున్న ఈ ట్రెండ్ ఎక్కడి వరకు వెళ్తుందో, దీనిపై నిర్మాతలు ఎంతవరకు కనికరించి పవన్ సినిమా అప్ డేట్ అందిస్తారో చూడాలి మరి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: