తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు ఎంత పెద్ద స్టారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న అగ్రహీరోలు అందరిలోకి ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న జాబితాలో మహేష్ ప్రతి సినిమాతో ముందు ఉంటాడు. అలాగే అతను తన ఫ్యాన్స్ కి అవసరమైన రీతిలో సినిమాలు చేస్తాడు అన్న మంచి పేరు కూడా ఉంది. అందుకే మహేష్ బాబు చాలా జాగ్రత్తగా తన స్క్రిప్టులను ఎంచుకుంటాడు. గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రయోగాలు చేయగల ధైర్యం ఉన్న ఏకైక స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ క్రమేపీ రొటీన్ సోషల్ మెసేజ్ సినిమాలకు అలవాటు పడ్డాడు.

 

అయితే మొన్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో పాత మహేష్ ను బయట పెట్టిన అతను ప్రస్తుతం దర్శకులకు ఒక పీడకలగా మారాడు. విషయం ఏమిటంటే సుకుమార్ సినిమా ఓకే చేస్తాను అంటూ సంవత్సరం పాటు తన వెంట తెప్పించుకుని చివరికి అనిల్ రావిపూడి కి ఛాన్స్ ఇచ్చాడు మహేష్. సుకుమార్ కి వెంటనే అల్లు అర్జున్ దొరికినా కూడా అతను ఖాళీ అవ్వడానికి సంవత్సరం పట్టడంతో సుకుమార్ 'రంగస్థలం' తర్వాత రెండేళ్లు ఖాళీగా ఉండాల్సి వచ్చింది.

 

ఇక ఇప్పుడు చూస్తే మహర్షి చిత్రం తర్వాత వంశీ పైడిపల్లిని తన కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేసిన మహేష్ తర్వాత చిత్రం కూడా వంశీ తోనే అని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. మహేష్ కూడా దానికి సంబంధించిన హింట్ ఇవ్వగా ఇప్పుడు చూస్తే మొత్తం కథ వినేసి తూచ్ అనేశాడు. తన తర్వాతి సినిమా చాన్స్ కాస్తా పరశురామ్ కి దక్కింది. ఒక స్టార్ హీరో కోసం కథ రెడీ చేసిన వంశీ పైడిపల్లి ఇప్పుడు మరో హీరోని వెతుక్కోవాలి అంటే అంత తేలిక కాదు. అదీ కాకుండా ఒక హీరోని రిజెక్ట్ చేసిన కథని ఓకే చేయించుకోవడం అంటే తల ప్రాణం తోకకు వచ్చినంత వ్యవహారం. అందుకే మహేష్ దగ్గరకు కథలు తీసుకొని వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు అగ్ర దర్శకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: