తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికకు తీసుకొని వెళ్ళిన సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి పై పలువురు కేసులు పెడుతున్నారట. విషయం ఏమిటంటే నిన్న జరిగిన 'హిట్' మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో యాంకర్ సుమ మరియు జక్కన్న మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. సుమ రాజమౌళితో ముగ్గురు డైరెక్టర్లు మరియు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ భార్యలు మీపై రెండు కేసులు నమోదు చేశారు అని రాజమౌళి కి చెప్పింది. సినిమా ఎప్పుడు అవుతోందని వారు అడుగుతున్నారని వారి భర్తలను తమ దగ్గరికి ఎప్పుడూ పంపిస్తారని వారు వాపోతున్నారు అని సుమ రాజమౌళితో చెప్పుకొచ్చింది.

 

అందుకు రాజమౌళి నవ్వి కేవలం కో-డైరెక్టర్ భార్యలే ఫిర్యాదు చేస్తున్నారా లేదా హీరోల ఫ్యాన్స్ కూడా చేస్తున్నారా అని అడిగారు. దానికి సుమా వారు ఎందుకు చేయట్లేదు సార్.... ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ నుంచి కూడా మాకు ఫిర్యాదులు అందుతున్నాయి మా హీరోని మీ దగ్గర పెట్టుకున్నారు.. ఏదో కిడ్నాప్ చేసినట్లు అని వారూ గగ్గోలు పెడుతున్నారని చెప్పింది. ఇంతకీ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నట్లు కూడా సుమ చెప్పింది. అలాగే డేట్ పక్కగా చెప్తే గాని కేసు క్లోజ్ చేసుకోమని వారు చెప్పినట్లు రాజమౌళికి వెల్లడించింది.

 

ఇకపోతే తర్వాత రాజమౌళి మొన్నే కదా సినిమా విడుదల తేదీనిను ప్రకటించాము అని అంటే సుమ చాలా వ్యంగ్యంగా ఏంటి మే 2021 ను విడుదల చేస్తారా? అని అడిగింది. దానికి రాజమౌళి చెప్పినట్లే రానున్న సంక్రాంతికి రాబోతున్నాము.. జనవరి 8 తేదీన విడుదల చేస్తామని చెప్పారు. అయితే తాము వచ్చే సంవత్సరం సంక్రాంతికి వస్తున్నామని ప్రకటించిన తర్వాత కూడా సుమ సమ్మర్లో వస్తారా అని అడగడం చూస్తుంటే ప్రజలకి రాజమౌళి చిత్రం మీద ఎలాంటి నమ్మకం ఉందో చూసి షాక్ తిన్నారు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం. మనం మరీ ఇంత లేట్ చేస్తామని జనాలు ముందే ఫిక్స్ అయిపోయారా అని వారి పనితనం మీద వారికే అనుమానం వచ్చేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: