టాలీవుడ్ లో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన సినిమా చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ఎంతగానో పోటీ పడుతూ ఉంటారు. ఆ దర్శకుడు ఈ దర్శకుడు అనే తేడా లేకుండా మహేష్ తో సినిమా అనగానే ఎంతో ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం వరుసగా మూడు విజయాలతో ఊపు మీదున్న మహేష్ బాబు... తన తర్వాతి సినిమా వంశీ పైడపల్లి తో చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎప్పటి నుంచో ఈ సినిమాకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి.

 

ఇది పక్కన పెడితే కొన్ని రోజుల నుంచి వంశీ పైడపల్లి తో చేసే సినిమా ఆగిపోయింది... ఆ సినిమా కాకుండా గీత గోవిందం ఫేం పరుశురాం తో సినిమా చేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. వంశీ పైడపల్లి తో సినిమా విషయంలో విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. అసలు దీనికి కారణం ఎంటీ అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఇటీవల మహేష్ బాబు... అమెరికా వెళ్ళారు. ఈ సందర్భంగా మహేష్ బాబుతో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని సమావేశం అయినట్టు సమాచారం. 

 

తనతో సినిమా చెయ్యాలని, భారీ పారితోషకం ఇస్తా అని కూడా ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. 50 కోట్ల వరకు ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా పరుశురాం తో చేసేదా లేక వంశీ పైడపల్లి తో చేసేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మహేష్ కూడా ఈ ఆఫర్ కి ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పరశురాం దర్శకుడిగా పనిచేయనున్నారని, మే నెలలో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఆ సినిమా ఈ సినిమానే అని, అందుకే వంశీ పైడపల్లి తో మహేష్ బాబు దూరం జరిగారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: