2018 ఫిబ్రవరి 24 ఇండియాన్ సినిమాను విషాదం ముంచెత్తిన రోజు. దివి నుంచి భువికి దిగివచ్చిన ఓ అందాల రాశి తిరిగి స్వర్గలోకానికి పయనమైన రోజు. అది వెండితెరకు చీకటి రోజు లాంటిది. అతిలోక సుందరి శ్రీదేవి అనూహ్య పరిస్థిల్లో ఈ లోకాన్ని విడిచిన రోజు. ఆ దారుణ సంఘటన జరిగి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి. అయిన భారతీయ సినీ ప్రేక్షకులు ఆమెను మరచిపోలేకపోతున్నారు. తన వారసురాలిగా కూతురు జాన్వీ కపూర్ను వెండితెరకు పరిచయం చేయాలనుకున్న శ్రీదేవి, ఆ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచారు.
ఇప్పటికే శ్రీదేవి కుటుంబం ఆమెను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనవుతుంది. గత ఏడాది ఇదే రోజున `నా హృదయం ఎప్పటికీ బరువెక్కుతుంది. అయినా నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటే ఎందుకంటే ఆ నవ్వులో నువ్వుంటావ్.. అమ్మా` అంటూ ఓ భావోద్వేగ సందేశాన్ని తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసింది. శ్రీదేవి మరణానికి ముందు జాన్వీకి బోనికపూర్ మొదటి భార్య సంతానమైన అర్జున్ కపూర్, అన్షులాకపూర్లకు పెద్దగా సంబంధాలు లేవు. కానీ శ్రీదేవి మరణంతో ఒక్కటైన ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు ఎంతో సన్నిహితంగా ఉంటున్నాయి. ముఖ్యంగా దుఖంలో ఉన్న సమయంలో జాన్వీని అర్జున్, అన్షులా ఎంతో దగ్గరకి తీసుకున్నారు.
ఈ విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్న జాన్వీ `మీకు తెలుసా చివరకు, మాది ఒకే రక్తం. నాకు ఆ ఒక్క విషయం తప్ప ఆ నాలుగు నెలలు ఏం జరిగిందో గుర్తు లేదు. ఒక రోజు మేం హర్ష అన్న రూంలో కూర్చొని ఉండగా అర్జున్ అన్న, అన్షులా అక్క వచ్చారు. ఆ రోజు మాకు పర్లేదు మేం బాగానే ఉంటా అనిపించింది` అని ట్వీట్ చేశారు. శ్రీదేవి కలను నెరవేరుస్తూ దడక్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జాన్వీ ప్రస్తుతం గుంజన్ సక్సెనా, దోస్తానా 2, రూహీఅఫ్జా, తక్త్ సినిమాల్లో నటిస్తోంది.
View this post on InstagramMy heart will always be heavy. But I’ll always be smiling because it has you in it.