సినిమా తారల మీద రూమర్లు రావడం అనేది చాలా సహజం. ముందు నుంచి కూడా ఈ రూమర్లు ఎక్కువగానే వస్తూ ఉండేవి. ఎక్కువ సినిమాలు ఏ హీరోతో అయినా చేసినా, షూటింగ్ స్పాట్ లో ఏ హీరోయిన్ తో అయినా హీరో సన్నిహితంగా ఉన్నా... ఎన్నో రూమర్లు పుట్టిస్తూ ఉంటారు. సినీ పరిశ్రమ మొదలైన నాటి నుంచి నేటి వరకు కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఇక వాటిని ఆపే వాడు అడ్డు చెప్పే వాడు ఎవడూ లేడు. గతంలో అయితే మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండేది. 

 

ఇలాగే అతిలోక సుందరి శ్రీదేవి విషయంలో రూమర్లు ఎక్కువగా వచ్చేవి. ఈ క్రమంలోనే ఆమె మిథున్ చక్రవర్తిని వివాహ౦ చేసుకున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరిగింది. శ్రీదేవి కొంతకాలం హిందీ కథానాయకుడు మిథున్ చక్రవర్తి తో కలసి ఉన్నదని, వారిద్దరకూ రహస్యంగా వివాహం చేసుకొన్నారని, అతడు తన మొదటి భార్య అయిన గీతాబాలికి విడాకులు ఇవ్వని కారణంగా అతడికి దూరంగా ఉన్నారని ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాసే వాళ్ళు. అసలు ఇది నిజం అని చెప్పడానికి ఎక్కడా కూడా ఒక్క ఆధారం కూడా లేదు. 

 

ఈ రూమర్లు వస్తూ ఉండగానే ఆమె బోనీ కపూర్ ను 1996 జూన్ 2న వివాహం చేసుకున్నారు. వీరికి జాన్వీ , ఖుషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మిథున్ చక్రవర్తి తో వివాహం విషయంలో మీడియా అప్పట్లో శ్రీదేవిని అవమానించింది అంటూ సిని పెద్దలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అనవసరంగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎందరో మండిపడిన సందర్భాలు ఉన్నాయి. శ్రీదేవి కూడా ఈ విషయంలో ఎక్కడా కూడా స్పందించలేదు. బోనీ కపూర్ ఆమె చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: