వెండి తెర మీద తిరుగులేని లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి వ్యక్తిగత జీవితం లో మాత్రం ఎన్నో బయటకు చెప్పుకోలేని ఇబ్బందులు పడింది. తెర మీద తన నవ్వు, తన అభినయం, తన అందం చూసి నవ్విన అభిమానులకు ఆమె వ్యక్తిగత జీవితం లో పడిన కష్టాల గురించి చాలా తక్కువ తెలుసు. తిరుగులేని స్టార్ గా ఉన్న సమయంలో కూడా ఆమెను ఎన్నో కష్టాలు వేధించాయి. తల్లి కోసం సినిమాలు చేసింది, ప్రేమించిన వాడి కోసం అవమానాలు ఎదుర్కొంది. 

 

పుట్టిన పిల్లల కోసం తప్పదు అనుకుంది. పైకి కనపడకుండా రోదించింది. అయినా సరే సినిమా కు మాత్రం శ్రీదేవి ఎప్పుడూ న్యాయం చేస్తూనే వచ్చింది. ఆమె జీవితం లో మలుపులు, అవమానాలు పుకార్లు ఎన్నో. అయినా సరే అన్నీ భరించి చెరగని ముద్ర వేసుకున్నారు శ్రీదేవి. ఆమె జీవితం లో ఎదుర్కొన్న సమస్యలు చాలా మందికి తెలియదు. నేడు ఆమె వర్ధంతి. ఇండియన్ సినిమా మొత్తం ఆమెను తలుచుకుంటుంది. శ్రీదేవి వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక సంఘటన... ఆమె తన తల్లి చితికి నిప్పు అంటించారు. 

 

హిందూ సాంప్రదాయాల ప్రకారం చూస్తే... కుమారుడు చితికి నిప్పు అంటించాలి. కాని తనకు సోదరులు ఎవరూ లేకపోవడంతో తన తల్లి అంతిమ సంస్కారాలను ఆమె నిర్వహించింది. ఆమె లమ్హె అను చిత్ర నిర్మాణంలో ఉండగా తండ్రి, జుదాయి అను చిత్ర నిర్మాణంలో ఉండగా తల్లి మరణించారు. ఈ వార్త అప్పట్లో హైలెట్ అయింది. శ్రీదేవి తండ్రి కి రెండో వివాహం, తల్లికి కూడా రెండో వివాహమే. ఆమె తండ్రికి ముందు ఒక కుమారుడు ఉన్నారు. కాని తల్లికి మాత్రం అబ్బాయిలు ఎవరూ పుట్టకపోవడం తో ఆమె తన తల్లి చితికి నిప్పు అంటించింది. శ్రీదేవి బాత్ టబ్ లో పడి మరణించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: