తెలుగు చిత్ర పరిశ్రమలో గీత గోవిందం సినిమా ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకుందో  తెలిసిన విషయమే. విజయ్ దేవరకొండ రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించారు. సినిమా మేకింగ్  పరంగా హీరో హీరోయిన్ ల నటన పరంగా ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు ఏకంగా వంద కోట్ల క్లబ్లో చేరి పోయింది ఈ సినిమా.దీంతో దర్శకుడు పరశురామ్ క్రేజ్  కూడా బాగా పెరిగింది. అయితే పరశురాం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అంటే చాలా పేర్లు వినిపించాయి... మహేష్ బాబు మొదలుకొని ఎన్నో పేర్లు వినిపించాయి. ఇక చివరికి గీత గోవిందం దర్శకుడు పరశురామ్ అక్కినేని నాగ చైతన్య తో నాగేశ్వరరావు అనే సినిమాలో  చేయబోతున్నారని  ప్రచారం జరిగింది. 

 

 

 ఇక దర్శకుడు పరశురామ్ హీరో నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ రష్మిక మందన సెలక్ట్ చేశారని వార్తలు వచ్చాయి.అయితే  ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరి. ఈ సినిమా పూర్తయిన తర్వాత వెంటనే నాగేశ్వరావు అనే సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది అని  గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్లో టాక్ వచ్చింది. అయితే నాగచైతన్య నాగేశ్వరావు సినిమా పై తాజాగా మరో పుకారు షికారు చేస్తోంది. నాగేశ్వరావు సినిమాను  పక్కకు పెట్టేసినట్లే  అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

 

 

 మహేష్ బాబు 27వ సినిమా  పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తెరకెక్కించే  అవకాశం రావడంతో... నాగచైతన్యతో నాగేశ్వరరావు సినిమాను దర్శకుడు పరశురామ్ పక్కనపెట్టే అవకాశం ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే మహేష్ బాబు పరుశురాం ల కాంబో మూవీ గురించి మాత్రం అధికారిక ప్రకటన రావాల్సివుంది. అదే సమయంలో అక్కినేని నాగచైతన్య తో చేయబోయే నాగేశ్వరరావు సినిమా పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్పాలి అంటూ అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. గీత గోవిందం సినిమా తర్వాత ఇప్పటివరకు పరశురామ్ ఏ సినిమా జోలికి వెళ్ళలేదు దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు... మళ్లీ ఇప్పుడు రెండు సినిమాలు అంటూ ప్రేక్షకులందరినీ కన్ఫ్యూజన్లో పట్టేశాడు దర్శకుడు పరశురామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: