శ్రీదేవి వ్యక్తిగత విషయాలకి వస్తే బోనీకపూర్ని పెళ్లి చేసుకోక ముందే అతని ఇంటికి వెళ్ళేది శ్రీదేవి. అప్పటికే మోనాకపూర్కి అర్జున్ కపూర్ పుట్టాడు. కానీ ఫ్రండ్స్గా ఉండే వాళ్ళ మధ్య రిలేషన్ ఉందని వార్తలు రావడంతో ఇంట్లోనే శ్రీదేవిని ఘోరంగా అవమానించారు. నోటికి వచ్చినట్లు బూతులు కూడా తిట్టారు. దీంతో బోనీకపూర్ని నిలదీసిన శ్రీదేవి పెళ్ళి చేసుకుంటేనే వస్తానని చెప్పడంతో బోనీకపూర్ అర్జున్కపూర్ తల్లికి విడాకులు ఇచ్చి శ్రీదేవిని పెళ్ళి చేసుకున్నారు. తన తండ్రిని దూరం చేసిందనే కోపంతో శ్రీదేవిని చూడడానికి కూడా ఇష్టపడలేదు అర్జున్ కపూర్. ఇక తన తల్లి చనిపోయాక అలాగే శ్రీదేవి కూతుర్లు హీరోయిన్గా అయ్యే సమయంలో శ్రీదేవికి కొద్దిగా దగ్గరయ్యాడు అర్జున్కపూర్. అంటే దాదాపుగా ఫ్యామిలీ ఒకచోటకి చేరుకుంది. అలా ఫ్యామిలీ పూర్తిగా కలుస్తుంది అనుకునే లోపే ఆమె చనిపోయింది. శ్రీదేవి మరణం యావత్ భారత దేశాన్ని కన్నీరు పెట్టించింది. అలాంటి తారను ఆ స్వర్గం నుండి మళ్ళీ పంపించాలని కోరుకుందాం.
అతిలోక సుందరిగా ప్రేక్షకుల మదిలో ఉన్న శ్రీదేవి. 1963 ఆగస్టు 13 వతేదీన తమిళనాడు శివకాశిలో జన్మించింది. అన్నిభాషల్లోనూ అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. బాలీవుడ్ అగ్రహీరోలందరితోనూ శ్రీదేవి స్క్రీన్ షేర్ చేసుకుంది. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ లాయర్ గా పనిచేసేవారు. తల్లి పేరు రాజేశ్వరి. శ్రీదేవికి శ్రీలత అనే చెల్లి, సతీష్ అనే సోదరుడు ఉన్నారు. శ్రీదేవి తల్లిదండ్రులది ప్రేమ వివాహం. శ్రీదేవి తల్లి రాజేశ్వరి అప్పట్లోనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించేవారు. అదే సమయంలో ఆమె వివాహితుడైన అయ్యప్పన్ న్యాయవాధితో ప్రేమలో పడింది. అప్పటికే అయ్యప్పన్కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శ్రీదేవి సినిమాల్లో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే ఆమె తల్లి రాజేశ్వరికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. తల్లి అంటే అమితమైన ప్రేమ ఉన్న శ్రీదేవి ఆమెను రక్షించుకోవడం కోసం విదేశాలకు తీసుకువెళ్ళింది. కేవలం డాక్టర్ల నిర్లక్ష్యంతో ట్యూమర్ ఒకచోట ఉంటే ఆపరేషన్ మరో చోట చేయడంతో ఆమె మరణించింది.