ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయిస్ట్ హీరోయిన్ గా రష్మిక మందనా అనే చెప్తున్నారు. ఏ ముహూర్తాన టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందో కానీ తొలి సినిమాతోనే హిట్ అందుకుని వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఇంతగా హిట్ ట్రాక్ దక్కించుకున్న హీరోయిన్ సమంత తర్వాత రష్మికనే అంటున్నారు. సమంత కూడా తెలుగులో చేసిన మొదటి సినిమా సూపర్ హిట్. తర్వాత ఆమె వెనుతిరిగి చూసింది లేదు. ప్రస్తుతం రష్మిక హవా చూస్తూంటే టాలీవుడ్ కి మరో సమంత వచ్చినట్టే అనిపిస్తోంది.

 

 

 

ఇప్పటివరకూ రష్మిక చేసిన సినిమాల్లో విజయ్ దేవరకొండతో చేసిన డియర్ కామ్రేడ్ మాత్రమే ఫ్లాప్ అయింది. కానీ ఆ సినిమా రిలీజ్ ముందు క్రియేట్ చేసిన సెన్షేషన్ కు సగం కారణం రష్మికనే అనేది నిజం. అప్పటికే గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో తెలుగులో తన హవా స్టార్ట్ చేసేసింది. ఛలో హిట్ తర్వాత కన్నడ సినిమాలు తగ్గించేసిన రష్మిక మొత్తం టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. కన్నడ హీరోతో జరిగిన ఎంగేజ్ మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని కెరీర్ పై దృష్టి పెట్టింది. ఇది కూడా ఆమెకు కలిసొచ్చి కెరీర్ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మహేశ్ తో చేసిన సరిలేరు సూపర్ హిట్ కావడం మరింత ప్లస్ అయింది.

 

 

సమంత కెరీర్లో ఫ్లాపులు తక్కువ హిట్లు ఎక్కువ. ఇది అందరికీ కుదిరే విషయం కాదు. ప్రస్తుతం రష్మిక హవా చూస్తుంటే సమంత ట్రాక్ రికార్డులానే వెళ్తోంది. భీష్మ కూడా బ్లాక్ బస్టర్ కావడం ఆమె అదృష్టం. రష్మిక ఇలానే ప్లాన్ చేసుకుంటూ మరో పదేళ్లు టాలీవుడ్ లో ఆమెదే హవా. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న రష్మిక ఎన్టీఆర్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకునేలా ఉంది.                                                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: