తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, లెజండరీ హీరోయిన్, జయలలిత జీవితం ఆధారంగా ప్రముఖ తమిళ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం తలైవి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ చిత్రంలో జయలలిత పాత్రలో నటిస్తుండగా ఎమ్ జి ఆర్ పాత్రలో ప్రముఖ నటుడు అరవింద స్వామి కనిపించనున్నాడు. ఇటీవలే ఈ చిత్రం నుండి అరవింద స్వామి లుక్ ను విడుదలచేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు జయలలిత జయంతి సందర్భంగా  కంగనా లుక్ ను విడుదలచేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ లో అచ్చం జయలలిత లాగే  కనిపించి కంగనా అదుర్స్ అనిపించింది. దాంతో సోషల్ మీడియాలో ఆమె లుక్ పై ప్రశసంలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ చిత్రానికి కీలకమైన శశికళ  పాత్రలో ప్రియమణి నటిస్తుంది. రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందిస్తున్న ఈ చిత్రాన్ని విబ్రి మీడియా పతాకం పై విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. 
 
 
తమిళ్ తోపాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదలకానుంది. జూన్ 26న ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇదిలా ఉంటే జయలలిత పై మరో బయోపిక్ కూడా తెరకెక్కుతుంది. లేడీ డైరెక్టర్ ప్రియదర్శి డైరెక్షన్ లో ది ఐరన్ లేడీ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. పేపర్ టేల్ పిక్చర్స్ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంపై పెద్దగా బజ్ లేదు. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: