తెలుగు ఇండస్ట్రీలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రం తర్వాత బాలకృష్ణ వరుసగా నటించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తో భారీ డిజాస్టర్ పొందారు. అదే సమయంలో ఏపిలో ఎన్నికలు రావడం.. హిందూ పూర్ నుంచి ఎమ్మెల్యేగా రెండవసారి ఎన్నికల కావడం జరిగింది. అయితే మళ్లీ ఆయన వెండి తెరపై తన జోరు కొనసాగించాలని చూస్తున్నారు. ఆ మద్య కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ‘రూలర్’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈమూవీలో ఉన్నదానికన్నా అతి ఎక్కువ ఉందని ప్రేక్షకులు రిజక్ట్ చేశారు. దాంతో ఈ చిత్రం కూడా భారీ డిజాస్టర్ అయ్యింది.
ప్రస్తుతం తనకు సింహా, లెజెంట్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటిలో ఓ చిత్రంలో నటిస్తున్నారు బాలకృష్ణ. అయితే అంతా ఓకే అయినప్పటికీ ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ విషయంలో కాంట్రవర్సీ నెలకొంది. మొదట నయనతార అనకున్నారట.. అయితే తనకి గల కమిట్మెంట్స్ కారణంగా కుదరదని నయనతార చెప్పిందట .. దాంతో శ్రియను తీసుకున్నారు. ఇదే క్రమంలో మహానటితో మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ని సంప్రదించారట చిత్ర యూనిట్. కానీ తనకు ఇతర షూటింగ్స్ ఉన్నాయని.. డేట్స్ కుదరవని సున్నితంగా తిరస్కరించిందట కీర్తిసురేష్.
ఆ సమయంలోనే కేథరిన్ ను సంప్రదించగా, భారీ పారితోషికాన్ని అడిగిందట. అప్పుడే అంజలి పేరును పరిశీలించి ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో అంజలి ‘డిక్టేటర్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య, అంజలి కెమిస్ట్రీ కూడా బాగానే వర్క్ ఔట్ అయ్యింది.. వీరిద్దరి కాంబినేషన్ లో మాస్ ఎలిమెంట్స్ బాగా పండాయి. ఇటీవల కాలంలో అంజలికి కూడా ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి. బోయపాటి సినిమాతో ఆమె కెరియర్ మళ్లీ ఊపందుకుంటుందేమో చూడాలి.