యువ హీరో నితిన్ టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం భీష్మ. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరిచి  సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా నితిన్  కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది భీష్మ సినిమా. ఇక టాక్ పరంగానే కాదు వసూళ్ళ పరంగా కూడా నితిన్ కెరీర్ లోనే బెస్ట్ వసూళ్లను రాబడుతుంది అని చెప్పవచ్చు. అంచనాలకు మించి వసూలు రాబడుతుంది ఈ సినిమా. అయితే ఇప్పట్లో ఈ సినిమాకు పోటీగా బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యే సినిమాలు ఏవి లేకపోవడంతో... భీష్మ సినిమా 100 స్పీడ్ తో దూసుకుపోతుంది. అయితే భీష్మ సినిమా ఫుల్ రన్లో 50 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. 

 

 

 అయితే భీష్మ సినిమా విడుదలకు ముందు నిశ్చితార్థం చేసుకున్న  జోష్ లో ఉన్న హీరో నితిన్ ఇప్పుడు భీష్మ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఫుల్ జోష్లో వున్నాడు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఓ ఆసక్తికర కామెంట్ చేశాడు. నితిన్ పెళ్లి వేడుకలు డబుల్ జోష్  జరగాలి అంటూ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. భీష్మ టీం మొత్తానికి కంగ్రాట్స్ చెబుతూ అల్లు అర్జున్ చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. యంగ్ హీరో నితిన్ కు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హర్ట్ ఫుల్  ఫుల్ విషెస్ చెప్పడంతో ప్రస్తుతం నెటిజన్లు  కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇదే కాదు  గతంలో కూడా తన సినిమాకు పోటీగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా బృందానికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి... ఎన్నో ప్రశంసలు కూడా పొందాడు అల్లు అర్జున్.

 

 

 అయితే ప్రస్తుతం బన్నీ భీష్మ సినిమాతో పాటు నితిన్ కూడా హార్ట్ఫుల్ విషెస్ తెలపడం తో అటు నితిన్ తో పాటు నితిన్ అభిమానుల్లో కూడా సరికొత్త జోష్  నిండిపోయింది అని చెప్పాలి. డబుల్ కంగ్రాచులేషన్ నితిన్ ఇక నీ పెళ్లి వేడుకలు డబుల్  జోష్లో సాగుతాయి. మంచి టైం వస్తే అంతా మంచిగానే జరుగుతుంది నీకు అంతా మంచే జరగాలి. భీష్మ చిత్ర బృందం మొత్తాన్ని  అభినందిస్తున్న అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: