మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ హీరోగా తెరకెక్కిన లోఫర్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ దిశా పటాని. తొలి సినిమా నిరాశపరిచినా బాలీవుడ్‌ బాట పట్టిన ఈ బ్యూటీకి అక్కడ మంచి అవకాశాలే వస్తున్నాయి. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో పాటు ప్రైవేట్‌ పార్టీస్‌లోనూ సందడి చేస్తున్న ఈ భామ,  తాజాగా ముంబై జుహూలోని  థియేటర్‌ను సందర్శించింది. అయితే అక్కడి నుంచి దిశ తిరిగి వెళుతున్న సమయంలో ఆమె బాడీగార్డ్స్‌ అతుత్సాహం ప్రదర్శించారు.


జుహూ థియేటర్‌ నుంచి బయటకు వస్తున్న దిశను బాడీగార్డ్స్‌ చుట్టూ ఉండి బయటకు తీసుకువచ్చారు. ఈ లోగా ఆమె కారు ఎక్కే సమయంలో కొంతమంది ఫోటోగ్రాఫర్‌లు ఎదురుగా వచ్చి ఫోటోలు తీసే ప్రయత్నం చేశారు. అయితే కారు డోరు తీసే ప్రయత్నంలో దిశ బాడీగార్డ్‌ ఓ ఫోటోగ్రాఫర్‌ను తోసేశాడు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాడీగార్డ్‌, ఫోటోగ్రాఫర్‌ మధ్య వాగ్వివాదం జరిగింది. గొడవ జరుగుతుండగానే కారు ఎక్కిన దిశ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

 

ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన మలంగ్ సినిమాలో ఆదిత్య రాయ్‌ కపూర్‌, కునాల్ కేము, అనిల్‌ కపూర్‌లతో కలిసి నటించింది. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న రాధే సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్‌, రణదీప్‌ హుడా, గౌతమ్‌ గులాటీలు కూడా నటిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

There is not one single day when I did not have problems and issues. This work is not easy and at times you have to take a tough stand and fight back when there is injustice. Today our Pap Kuttub had a war of words between #dishapatani body guard when he tried to request Disha for a picture as he had not got any frames but the bodyguard pushed him out with no reason. Later Disha's manager came and apologised for what happened. #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

మరింత సమాచారం తెలుసుకోండి: