సినీ పరిశ్రమలో ఒకోసారి ఒకరు కాదన్న సబ్జెక్ట్ మరొకరు ఓకే చేయడం.. ఒక హీరోతో సినిమా చేసే అవకాశం రాకపోతే మరో హీరోతో అవకాశం దక్కడం ఇలా జరుగుతూంటాయి. ప్రస్తుతం అలాంటి అవకాశమే దSర్శకుడు వంశీ పైడిపల్లికి దక్కిందని అంటున్నారు. వంశీ పైడిపల్లితో సినిమాకు మహేశ్ నో చెప్పాడనే రెండు రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై అఫీషియల్ న్యూస్ లేకపోయినా ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తను హీరో, దర్శకుడు కూడా ఇంతవరకూ ఖండించకపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది.

 

 

 

అయితే.. కథ నచ్చక మహేశ్ వంశీని వద్దనడంతో ఇప్పుడు వంశీ పైడిపల్లికి మెగా క్యాంప్ నుంచి పిలుపొచ్చిందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కే 153వ సినిమాను డైరక్ట్ చేసే అవకాశం వచ్చిందని ఫిలింనగర్ లో ఓ వార్త రౌండ్ అవుతోంది. మళయాళంలో సూపర్ హట్ అయిన లూసీఫర్ సినిమా రీమేక్ రైట్స్ ను గత ఏడాది రామ్ చరణ్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రీమేక్ చేసే బాధ్యతను వంశీకి అప్పగించినట్టు చెప్పుకుంటున్నారు. మాతృకలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది.

 

 

 

వంశీ చెప్పిన లైన్ బాగున్నా పూర్తి స్క్రిప్ట్ పై మహేశ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు రౌండ్ అవుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి 152వ సినిమా షూటింగ్ దశలో ఉంది. వంశీకి మహేశ్ తో సినిమా లేదన్న వార్త, మెగా క్యాంప్ నుంచి వంశీకి పిలుపు వచ్చిందన్న వార్తలపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తాడనే వార్తలూ లేకపోలేదు. ఈ వార్తలపై అటు వంశీ నుంచి కానీ.. ఇటు మెగా క్యాంప్ గానీ స్పందించాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: