తెలుగు లో గత అ..ఆ తర్వాత వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న నితిన్ తాజాగా వెంకి కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో నితిన్ సరసన లక్కీ హీరోయిన్ రష్మిక మందన నటించింది.  ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి.  చాలా కాలంగా ఎదురు చూస్తున్న మంచి హిట్ అందుకున్న నితిన్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ చేస్తున్నారు.  ప్రస్తుతం నితిన్ సినిమాలు రెండు సెట్స్ పై వున్నాయి. ఒకటి 'రంగ్ దే' కాగా, మరొకటి 'చెక్'.

 

'రంగ్ దే' సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడు.  ఇప్పటికే ఈ సినిమా 30 శాతం చిత్రీకరణ జరుపుకుంది. మిగతా 70 శాతం చిత్రీకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో వున్నారు.  ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’ నేడు విజయదశమి పర్వదినాన ప్రారంభమయింది. ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

 

ఇక 'చెక్' సినిమాకి చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. భవ్య సంస్థవారు నిర్మించే ఈ సినిమా, థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో నితిన్ చాలావరకూ ఖైదీ డ్రెస్ తోనే కనిపిస్తాడట.  అయితే నితిన్ మాత్రం 'భీష్మ' హిట్ తరువాత, 'రంగ్ దే'వంటి ప్రేమకథా చిత్రం రావడమే మంచిదనే అభిప్రాయంతో వున్నాడని అంటున్నారు. అందువలన 'భీష్మ' తరువాత నితిన్ నుంచి 'రంగ్ దే' రావడమే ఖాయమని తెలుస్తోంది.  మరి కీర్తి సురేష్ తో నితిన్ కి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: