టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఇటీవల నటించిన సరిలేరు నీకెవ్వరు తో మంచి విజయం అందుకున్నారు. ఇక ఆ సినిమా విజయానందాన్ని పంచుకోవడానికి ఇటీవల తన ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెళ్లిన మహేష్, కొద్దిరోజుల క్రితం తిరిగి వచ్చారు. ఇక ఆయన నటించబోయే తదుపరి సినిమా విషయమై కొన్నాళ్లుగా అటు టాలీవుడ్ వర్గాలతో పాటు ఇటు ప్రేక్షకుల్లో కూడా విపరీతంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో తనతో కలిసి మహర్షి సినిమాని తీసిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరొక్కసారి మహేష్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అలానే మహేష్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తదుపరి సినిమాని వంశీ తో చేస్తున్నట్లు చెప్పారు. 

 

అయితే ఆ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం కాకపోవడం, అలానే అదే సమయంలో మరొక దర్శకుడు పరశురామ్ పూర్తి స్క్రిప్ట్ తో వచ్చి మంచి కథను వినిపించడంతో మహేష్ ఆ సినిమాకు పచ్చ జండా ఊపినట్లు సమాచారం. అయితే అసలు మ్యాటర్ అది కాదని, వంశీతో తదుపరి సినిమాని మహేష్ చేయకపోవడానికి ఒక వ్యక్తి కారణం అని అంటున్నారు. ఆయన మరెవరో కాదు దిల్ రాజు అని సమాచారం. ఇటీవల తనతో పాటు దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మించిన సరిలేరు సినిమా ఇప్పటికీ కూడా అక్కడక్కడా కొన్ని సెంటర్స్ లో బాగానే ఆడుతున్నప్పటికీ, ఆర్ధాంతరంగా దానిని పలు థియేటర్స్ నుండి తీసేశారని, ఇక సినిమాకు అంత అన్యాయం జరుగుతున్నా నిర్మాత దిల్ రాజు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారని కొద్దిరోజుల క్రితం కొందరు ఫ్యాన్స్ వచ్చి మహేష్ కు చెప్పడం జరిగిందట. 

 

ఇక మరోవైపు వంశీ తో తాను చేయాలనుకున్న సినిమాకు నిర్మాతగా దిల్ రాజు కూడా వ్యవహరించనుండగా, రాజుతో ఇప్పుడు సినిమా చేయడం ఇష్టం లేని మహేష్, వంశి తో కూడా కుదరదని తేల్చి చెప్పినట్లు టాక్. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాల్సి ఉంది. కాగా మహేష్ బాబు వ్యక్తిత్వం అటువంటిది కాదని, అలానే దిల్ రాజు తో ఆయనకు మంచి అనుబంధం ఉందని, కావున ప్రచారం అవుతున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవం అని కొందరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ దానిని కొట్టిపారేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: