సూపర్ స్టార్ మహేష్, బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న ల కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు, ఇటీవల  సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. తొలిసారిగా మహేష్ సినిమాకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ గా నటించిన ఈ సినిమాని పలు కమర్షియల్ హంగులతో సైనికులకు సంబందించిన ఒక మంచి మెసేజ్ ని జోడించి దర్శకుడు అనిల్ తెరకెక్కించడం జరిగింది. 

 

దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందించారు. ఇకపోతే ఇప్పటికే రిలీజ్ అయి దాదాపుగా 40 రోజులు పైగా గడుస్తున్నా ఈ సినిమాని అతి త్వరలో ప్రముఖ డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. సినిమా ప్రారంభ సమయంలోనే ఈ సినిమా హక్కులను భారీ ధర చెల్లించి అమెజాన్ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా మార్చి మొదటి వారంలో అమెజాన్ లో ప్రసారం కానున్నట్లు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకున్న జెమినీ టివి వారు, దీనిని ఉగాది కానుకగా తమ టివి ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు టాక్. 

 

మరి ఈ విధంగా ఇప్పటివరకు థియేటర్స్ లో సందడి చేసిన సరిలేరు సినిమా, అతి త్వరలో బుల్లి తెర, అలానే డిజిటల్ మాధ్యమాల లో కూడా సందడి చేయనుందన్నమాట. మరి ఈ సినిమా రేపు జెమినీ లో ప్రసారం అయిన తరువాత ఎంత మేర టిఆర్పి రేటింగ్స్ దక్కించుకుంటుందో చూడాలని, మరోవైపు ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన అలవైకుంఠపురములో సినిమా ఈనెల 26 నుండి సన్ నెక్స్ట్  వీక్షకులకు అందుబాటులోకి రానుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: