ఇండస్ట్రీలో ఒకసారి నో చెప్పిన తర్వాత మళ్లీ బేరాలుండవు. ఆ డీల్ అక్కడితో ఆగిపోతుంది. కానీ మహేశ్ మాత్రం నో చెప్పిన డైరెక్టర్ తోనే మళ్లీ సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నాడట. ఆల్ రెడీ టాక్స్ కూడా జరుగుతున్నాయని చెబుతున్నారు. 

 

మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తానని చెప్పాడు. స్క్రిప్ట్ సిద్ధమవ్వగానే సెట్స్ కెళ్తామని ప్రకటించాడు. కానీ ఇప్పుడు వీళ్ల ప్రాజెక్ట్ హోల్డ్ లోకి వెళ్లిందనే వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ విషయంలో చిన్న కన్ ఫ్యూజన్ వచ్చిందని.. అందుకే వంశీ పైడిపల్లికి మహేశ్ మరికొంత టైమ్ ఇచ్చాడని చెబుతున్నారు. అలాగే ఈ టైమ్ లో మరో మూవీ చేసే ఆలోచనలో ఉన్నాడనే టాక్ వచ్చింది.

 

గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్ బాబు కోసం ట్రై చేశాడు పరశురామ్. డిస్కషన్స్ కూడా జరిగాయి. కానీ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ పక్కకెళ్లడంతో మళ్లీ పరశురామ్ కు కాల్ చేశాడట మహేశ్. ఓ స్టోరీ తీసుకురమ్మని ఇన్ వైట్ చేసినట్టు తెలుస్తోంది. 

 

గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్ బాబు కోసం ట్రై చేశాడు పరశురామ్. డిస్కషన్స్ కూడా జరిగాయి. కానీ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ పక్కకెళ్లడంతో మళ్లీ పరశురామ్ కు కాల్ చేశాడట మహేశ్. ఓ స్టోరీ తీసుకురమ్మని ఇన్ వైట్ చేసినట్టు తెలుస్తోంది. 

 

మహేశ్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో వెంటనే నాగచైతన్య దగ్గరకు వెళ్లాడు పరశురామ్. నాగేశ్వర్రావు అనే సినిమా అనౌన్స్ చేశాడు. మరిప్పుడు మహేశ్ బాబు నుంచి కాల్ వచ్చింది. మరి ఎన్నాళ్లో వేచిన కాల్ అందుకున్న పరశురామ్ వెంటనే ప్రిన్స్ కోసం స్టోరీ రెడీ చేస్తాడా..లేక నాగచైతన్య సినిమా పూర్తయ్యాక అటువైపు వెళ్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: