మెగాస్టార్ చిరంజీవి తో సైరా సినిమా చేసిన సురేందర్ రెడ్డి ప్రస్తుత౦ ఎవరితో సినిమా చెయ్యాలో అర్ధం కాక ఇబ్బంది పడుతున్నాడు. సైరా సినిమా ప్రభావమో లేక మరొకటో తెలియదు గాని సురేందర్ రెడ్డి మాత్రం ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. కిక్ సినిమా తో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ డైరక్టర్... ఇప్పుడు అవకాశాల కోసం ఇబ్బంది పడటమే టాలీవుడ్ లో చర్చకు దారి తీసింది. వాస్తవానికి ఎప్పటి నుంచో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో సినిమా చేయాలని డైరెక్టర్ సురేందర్ రెడ్డి భావిస్తున్నాడు. 

 

కిక్ సినిమా తర్వాత ఆ సినిమాకు ప్లాన్ చేసినా అప్పుడు ప్రభాస్ బాగా బిజీ అయిపోయాడు. ఆ తర్వాత బాహుబలి పేరుతో ఆరేళ్ళ పాటు ప్రభాస్ ఎవరికి దొరకలేదు. చిరంజీవితో `సైరా` షూటింగ్ సమయంలోనే ప్రభాస్‌ను కలిసి లైన్ కూడా చెప్పినా లాభం లేకుండా పోయింది. ప్రభాస్ బాగా బిజీగా ఉండడం, వరుసగా సినిమాలు ఉండటంతో సురేందర్‌కు ఛాన్స్ దొరకలేదని అంటున్నారు. దాంతో మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్‌ తో సినిమా చెయ్యాలని స్టోరీ కూడా సిద్దం చేసుకున్నాడు. ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో వరుణ్ హీరోగా సినిమా ప్లాన్ చేసాడు.

 

ఇది యాక్షన్ థ్రిల్లర్ రూపొందించాలనుకుని భావించాడు సురేందర్ రెడ్డి. కారణం ఏంటో తెలియదు గాని... ఈ సినిమా కూడా దాదాపుగా ఆగిపోయింది. అయితే ఎన్నో ప్రయత్నాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి సురేందర్‌కు పిలుపు వచ్చిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నారు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దంగా ఉంది. సుకుమార్ సినిమా తర్వాత సురేందర్ దర్శకత్వంలోనే బన్నీ సినిమా చేస్తున్నాడని అంటున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో`రేసుగుర్రం`లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: