టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే అతి త్వరలో పవన్, క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీలో కూడా నటించనున్నారు. తన సినిమాలు, రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఏవైనా మంచి సక్సెస్ సాధిస్తే, ఆ సినిమా యూనిట్ ని అభినందించే వారిలో పవన్ కూడా ఒకరు. 

 

ఇక ఇటీవల తన వీరాభిమాని అయిన నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవి భీష్మ, తొలిరోజు తోలి ఆట నుండి మంచి టాక్ ని సంపాదించి ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో సినిమా యూనిట్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మొన్న కేక్ కట్ చేసి సక్సెస్ సంబరం కూడా జరుపుకున్నారు. 

 

ఇక ఇటీవల ఈ సినిమా సక్సెస్ పై యూనిట్ సభ్యులను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభినందిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ట్వీట్ చేయగా, నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీష్మ హీరో నితిన్ ని, అలానే దర్శకుడు వెంకీ, నిర్మాత వంశీ లను ప్రత్యేకంగా పిలిపించి అభినందనలు తెలిపారు. ఇక ఏకంగా పవన్ తమ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో అమితానందాన్ని వ్యక్తం చేసిన దర్శకుడు వెంకీ, హీరో నితిన్ ఇద్దరూ కూడా పవన్ తో కలిసి దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసారు. ఇక ప్రస్తుతం ఆ ఫొటోలు పలు మీడియా మాధ్యమాల్లో వెల్లువగా ప్రచారం అవుతుండగా, పలువురు నెటిజన్లు పవన్ మంచి గుణం పై పొగడ్తలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: