టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య మంచి స్నేహమే ఉంది. ఇందుమూలంగానే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవడం జరిగింది. ఆ సమయంలో మహేష్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకోవడం మనకందరికీ తెలిసినదే. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఎవరికి వారు తమ తమ సినిమాకి సంబంధించిన షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు అయితే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో నెక్స్ట్ సినిమా లైన్ లో పెట్టడానికి స్టోరీలు వినే కార్యక్రమంలో ఫుల్ బిజీగా ఉన్నారు.

 

ఇదే తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న 'RRR' సినిమాకి సంబంధించి షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలావుండగా తాజాగా విమానాశ్రయంలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావటంతో చాలామంది నెటిజన్లు మహేష్ బాబు, ఎన్టీఆర్ ఒకేలా వ్యవహరించారని ఆ వీడియో చూసి కింద కామెంట్ పెడుతున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి కారు ఎక్కడం కోసం మహేష్ ఎయిర్ పోర్ట్ లో నడుస్తూ ఉన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మహేష్ ఎయిర్ పోర్ట్ లో నడుస్తున్నంత సేపు అక్కడున్న ఓ ఫోటో గ్రాఫర్ మహేష్ ని ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు.

 

మహేష్ కు కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ మహేష్ సహనం కోల్పోకుండా ఫోటో గ్రాఫర్ పై కామెడీ పంచ్ లు వేశాడు. 'ఆపమ్మా ఆపు.. ఎప్పుడూ ఇదే  పనా.. బోర్ కొట్టట్లేదా నీకు' అని ప్రశ్నించాడు. దీనితో అక్కడున్న సిబ్బంది అంతా నవ్వుల్లో మునిగి తేలారు. ఈ విధంగానే గతంలో జూనియర్ ఎన్టీఆర్ విలువైన సమయంలో విమానాశ్రయంలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుండగా ఎన్టీఆర్ ఫోటో గ్రాఫర్ ని ఉద్దేశిస్తూ.. నువ్వెప్పుడూ ఇక్కడే ఉంటావా.. స్నానం, నిద్ర అన్నీ ఇక్కడేనా అని సెటైర్లు వేశాడు. ఇప్పుడు ఈ విధంగానే మహేష్ రియాక్ట్ అవటం తో సేమ్ ఇద్దరూ ఒకే లాగా రియాక్ట్ అయ్యారు అని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో కింద నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: