స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ఆర్య, ఆర్య 2 వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి స్మగ్లింగ్ నేపధ్యంలో ఒక సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. 

 

 

అలాగే ఈ చిత్రంలో బ‌న్నీ స‌ర‌స‌న‌ రష్మిక మందన్న హీరోయిన్‌ గా న‌టించ‌నుంది. గత ఏడాది అక్టోబర్‌ లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో ఈ మూవీ షూటింగ్‌ లో పాల్గొన బోతున్నారు బన్నీ. దానికి సంబంధించి ఇప్పుడు లుక్‌ కోసం కసరత్తులు చేస్తున్నారు ఈ హీరో.

 

 

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఎర్రచందనం మాఫియా నేపథ్యంలో తెరకెక్కే ఈ మూవీలో బన్నీ డ్యూయల్ రోల్‌ లో కనిపించనున్నారట. లారీ డ్రైవర్‌ గా, బిజినెస్‌ మ్యాన్‌ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నారట. అంతేకాదు బిజినెస్‌ మ్యాన్ రోల్ విలన్‌ పాత్ర అని తెలుస్తోంది. 

 

 

ఇందుకోసం రెండు డిఫరెంట్ స్టైల్స్‌ లో కనిపించేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారని టాలీవుడ్‌ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అల్లు అర్జున్ ద్విపాత్రాభినయంలో నటించే మొదటి మూవీ ఇదే అవుతుంది. అలాగే విలన్‌ గా నటించే మొదటి మూవీ కూడా ఇదే అవ్వనుంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌యో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే.. ఇటీవల సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన అలా వైకుంఠపురం లో సినిమా భారీ హిట్ ని తెచ్చిపెట్టింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు, అదేవిధంగా ఈ సినిమాలో వచ్చిన పాట రికార్డ్ ను సాధించింది. మరి ఇప్పుడు తియ్యబోయే సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: