టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి మూవీ అప్పట్లో రికార్డు ల మోత మోగించింది.  ఆ మూవీలో మహేష్ బాబు, ప్రకాశ్ రాజ ల మద్య వచ్చే సన్నివేశాలు చూసి థియేటర్లో చప్పట్ల మోత మోగింది.  అప్పటి నుంచి మహేష్ బాబు నటిస్తున్న చాలా చిత్రాల్లో ప్రకాశ్ రాజ్ ఏదో ఒక పాత్రలో కనిపిస్తున్నారు.  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ చిత్రంలో మహేష బాబుకి విలన్ గా ప్రకాశ్ రాజ్ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. 

 

ఈ మూవీతో పదమూడేళ్ల తర్వాత విజయ శాంతి రీ ఎంట్రీ ఇచ్చింది.  తాజాగా మహేష్ బాబు - ప్రకాశ్ రాజ్ ల మద్య విభేదాలు వచ్చాయని.. అందుకే ఆయనకు చాన్సులు తగ్గుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.  తాజాగా దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చూస్తుంటే నవ్వాలో... ఏడ్వాలో తెలియని పరిస్థితి అన్నారు.  ప్రస్తుతం తాను సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా కాస్త బిజీగా ఉన్నానని.. అందుకే తాను కాస్త విరామంలో ఉంటున్నాని అన్నారు.  మా మధ్య విభేదాలు ఎందుకుంటాయి.. ఇటీవలే కదా.. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించా.. బ్రంహ్మాండమైన విజయం అందుకుంది. 

 

నాకు మహేష్ తో నటించడం అంటే చాలా ఇష్టం అని.. పోకిరి నుంచి మొన్నటి సరిలేరు నీకెవ్వరు వరకు మా కాంబినేషన్ లో మంచి విజయాలు అందుకున్నాయని అన్నారు.  అయితే మా మద్య విభేదాల కారణంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రాలేదని అపోహలు ఏర్పడ్డాయి. వాస్తవానికి నేను ఏ ప్రిరీల్ ఫంక్షన్ కి పెద్దగా హాజరు కాను.. ఆ విషయం చిత్ర యూనిట్ కి కూడా తెలుసు.  అంతే కాదు నేను పెద్దగా చిత్రాలు కూడా చూడను.. అంతేందుకు సరిలేరు నీకెవ్వరు కూడా చూడలేదు. అంతమాత్రాన మహేష్ తో విభేదాలు ఉన్నట్లా అని ప్రకాష్ రాజ్ అన్నారు. మహేష్ బాబు బంగారం అని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: