మన టాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య వార్తలు గట్టిగా ఒక పది సంవత్సరాల నుంచి బాగా పాపులర్ అవుతున్నాయి. కాని బాలీవుడ్లో ఈ ఈ వార్తలు ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి బాగా పాపులర్ అయ్యేవి అప్పట్లో బాలీవుడ్ మీడియా ఇద్దరు హీరో హీరోయిన్లు కలిసి ఉన్న వాళ్ల గురించి చిలవలు పలవలుగా రాసేవి. అప్పటి బాలీవుడ్ వార్తలు మన తెలుగు వాళ్లకు వారం వారం వచ్చే స్వాతి పుస్తకంలో గుసగుసల ద్వారా బాగా తెలిసేవి. అప్పట్లో బాలీవుడ్లో యంగ్ స్టార్ హీరో గా ఉన్న అక్షయ్ కుమార్ కు కిలాడి హీరో అన్న బిరుదు ఉండేది.

 

అక్షయ్ కుమార్ అప్పట్లో స్టార్ హీరో గా ఉన్నప్పుడు వరుస పెట్టి ఒక్కో స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ కొనసాగిస్తూ వచ్చాడు. హీరోయిన్ లను వరుసబెట్టి మారుతూ ఉండటంతో అతడిని అందరూ కిలాడి కింగ్ అని పిలిచేవారు. అక్షయ్ కుమార్ ముందుగా అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న రవీనాటాండన్ తో కొద్దిరోజులపాటు ఎఫైర్ నడిపిన‌ట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం చేశారని పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్న టైంలో విడిపోయారు. మళ్లీ అక్షయ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి ని ప్రేమ ముగ్గులోకి దింపాడు అన్న వార్తలు వినిపించాయి. అదే టైములో తన కంటే వయసులో పెద్దది అయిన సీనియర్ హీరోయిన్ రేఖతో కూడా ఎఫైర్ నడిపినట్టు వినిపించాయి.

 

ఇలా వరుసగా అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఉన్నా శిల్పాశెట్టి రవీనాటాండన్ రేఖ తో ప్రేమాయణం నడిపిన ఈ కింది చివరకు ఈ ముగ్గురు హీరోయిన్లకు హ్యాండిచ్చి డింపుల్ కపాడియా కూతురు అయిన క్రేజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాకు మూడు ముళ్ళు వేసాడు. రెండున్నర దశాబ్దాల వీరి వైవాహిక జీవితం ఎంతో ప్రశాంతంగా సాగుతోంది. ట్వింకిల్ ఖ‌న్నా తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన శీను సినిమాలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: