టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన హిట్ సినిమా 'ఛలో'. ఈ సినిమా తర్వాత శౌర్య కెరీర్ బాగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఛలో సినిమా తరవా, సొంత బ్యానర్ లో నర్తనశాల, రీసెంట్ గా వచ్చిన అశ్వద్దామ తో పాటు దాదాపు ఐదు సినిమాల్లో నటించాడు. కానీ ఈ ఐదు సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. తనే సొంతగా కథ రాసిన అశ్వథ్థామ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా ఈ కుర్ర హీరో ఆశల మీద నీళ్ళు చల్లింది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు యాక్షన్ ఎంటర్‌టైనర్ అంటూ హైప్ బాగా  క్రియేట్ అయింది. కానీ ఆ హైప్ సినిమా హిట్టవడానికి కాస్త కూడా ఉపయోగపడలేదు. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిల పడింది. ఈ దెబ్బకి నాగశౌర్య మార్కెట్ మొత్తం పడిపోయింది.

 

దాంతో నాగశౌర్య కుమిలిపోతున్నాడట. ఇంతలోనే శౌర్యకి మరో షాక్ తగిలింది. అప్పట్లో నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మాతగా సినిమా ప్రారంభించిన సంగతి  తెలిసిందే. ఈ సినిమా టాకీ పార్ట్ కూడా కొంత కంప్లీట్ చేశారు. అయితే షూటింగ్ ఇప్పటివరకూ చాలా స్లోగా సాగింది.. ఆ సినిమా చేస్తూనే నాగశౌర్య మిగతా ప్రాజెక్ట్ లకు కమిట్ అయ్యాడు. అయితే తాజాగా అవసరాలతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే శౌర్యపై అమెరికాలో ఓ షెడ్యూల్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. కానీ ఏడాదిగా షెడ్యూల్ ప్లాన్ చేయడం... మళ్ళీ క్యాన్సిల్ అవడం ..ఇలా జరుగుతూనే సంవత్సరం గడిచింది.

 

చివరికి ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవదని మొతంగా క్యాన్సిల్ చేశారట. అయితే ఈ సినిమా ఇలా అర్థాంతరంగా ఆగిపోవడానికి మరో ప్రధాన కారణం కూడా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ముందు అనుకున్న దానికంటే ఓవర్ బడ్జెట్ అవుతుందని...ప్రస్తుతం నాగశౌర్య పై అంత పెట్టడం కూడా దండగని అందుకే ఈ సినిమాని ఆపేశారని తెలుస్తోంది. మొత్తానికి నాగశౌర్య సినిమా కెరీర్ అత్యంత దారుణంగా తయారైంది. ప్రస్తుతం ఈ కుర్ర హీరోతో సినిమాలు చేయడానికి ఏ నిర్మాతా ముందుకు రావడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: