హీరోయిన్ రేఖ వేదవ్యాస్ మన తెలుగు వారికి బాగానే సుపరిచితం అనే చెప్పాలి. స్వతహాగా కన్నడ భామ అయిన రేఖ, మొదటగా కొన్నేళ్ల క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆకాష్ హీరోగా తెరకెక్కిన ఆనందం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మితం అయిన ఆ సినిమా అప్పట్లో ఎంతో పెద్ద విజయాన్ని అందుకుని రేఖ కు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత జాబిలి, ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, అనగనగ ఓ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్ సహా మరికొన్ని సినిమాల్లో నటించిన రేఖ, మరోవైపు పలు కన్నడ సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు దక్కించుకుంది. 

 

ఇక ఒకానొక సమయంలో ఆమె తన పేరును అక్షర అని మార్చికున్నప్పటికీ కూడా అది ఆమె సినీ కెరీర్ ని ఏ మాత్రం మార్చలేకపోయింది. అయితే తెలుగులో 2012లో వచ్చిన జీనియస్ సినిమా తరువాత టాలీవుడ్ లో అవకాశాలు లేని రేఖ, ఆ తరువాత 2014లో తమిళ్ లో వచ్చిన పదం పేశుమ్ అనే సినిమాతో సినిమాల్లో నటించడం ఆపేసింది. ఇక ప్రస్తుతం బెంగళూరులో తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్న రేఖ, నిన్న రాత్రి ఈటివి ఛానల్ లో ప్రసారం అయిన అలీతో సరదాగా అనే ప్రోగ్రాం ని స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి, తన లైఫ్, మూవీ కెరీర్ గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. 

 

ముందుగా తనకు సినిమాల్లో ఉన్న పేరు రేఖ అని, అయితే ఒకానొక సమయంలో తాను ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయినట్లు పేపర్ లో వార్త రావడంతో పాటు, ఆపై శ్రద్ధాంజలి అంటూ కూడా ప్రకటన వచ్చిందని, అది చూసి తనతో సహా ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం షాక్ అయ్యాం అని, అది మరింత వైరల్ అవడంతో కొందరు సినిమా ఇండస్ట్రీ వారు సైతం దిగ్బ్రాంతికి గురయి తమ ఇంటికి ఫోన్లు చేసి అసలు విషయం తెలుసుకున్నారని ఆమె అన్నారు. అయితే అదే సమయంలో రేఖ అనే పేరుతో ఎవరో మరొక టివి నటి ఆ యాక్సిడెంట్ లో చనిపోతే, తన పేరు తప్పుగా వచ్చిందని ఆమె అన్నారు. దానితో ఆ పేరు కలిసి రాలేదని భావించి, ఆ వెంటనే తన పేరును అక్షరగా మార్చుకున్నట్లు రేఖ చెప్పారు. కాగా ఆ యాక్సిడెంట్ వార్తతో చాలామంది తమ సన్నిహితులు కూడా ఎంతో ఆందోళన చెందారని, అయితే ఆపై అది నిజం కాదని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారని ఆమె ఆ ప్రోగ్రాంలో వ్యాఖ్యాత ఆలీతో చెప్పారు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: