ముందుగా పలు టివి షోస్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నటి సురేఖ వాణి, స్వతహాగా విజయవాడకు చెందిన వారు. అయితే తన ఇంటర్మీడియట్ విద్య సమయంలోనే యాంకరింగ్ పై ఇష్టంతో ఆపై టీవీ ఫీల్డ్ కు చేరిన సురేఖ వాణి, అనంతరం తన యాక్టింగ్ టాలెంట్ తో అప్పట్లో మాటివిలో ప్రసారం అయిన మొగుడ్స్ పెళ్లామ్స్, మా టాకీస్ వంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలు సోప్ యాడ్స్ కు దర్శకత్వం వహించడం, అలానే కొన్ని టీవీ సీరియల్స్ కు కథలు అందించడం వంటివి చేసిన సురేష్ తేజతో అప్పట్లో ఆమె వివాహం జరిగింది. వారిద్దరికి సుప్రీత అనే కుమార్తె కూడా ఉంది. ఆ తరువాత నుండి పలు సినిమాల్లో కూడా నటించి మంచి పేరు దక్కించుకున్నారు సురేఖ వాణి. 

 

అయితే ఇటీవల గత ఏడాది మేలో ఆమె భర్త సురేష్ తేజ అనారోగ్య కారణాలతో హఠాత్తుగా మరణించారు. అయితే ఆమె భర్త అనారోగ్యం విషయం సురేఖ వాణి ఎప్పుడూ చెప్పేవారు కాదని, షూటింగ్ లకు వచ్చినపుడు తన పని తాను చేసుకుని సైలెంట్ గా వెళ్లిపోయేవారని పలువురు నటులు అప్పట్లో సురేష్ తేజ మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఆ తరువాత నుండి తన కూతురితో హ్యాపీగా లైఫ్ ని గడుపుతున్న సురేఖ వాణి, సుప్రీత లోనే తన భర్తను చూసుకుంటున్నానని, తన కూతురు ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి తాను ఎంతైనా కష్టపడతానని, ఆమె తన లోకం అని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో సురేఖ చెప్పడం జరిగింది. 

 

ఇక ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు అభిమానులతో షేర్ చేసుకునే అలవాటున్న సురేఖ వాణి, ఇటీవల బన్నీ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ బుట్టబొమ్మ సాంగ్ కు తన కూతురు సుప్రీతతో కలిసి డాన్స్ చేసిన వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఇక ఆ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా అకౌంట్స్ లో వైరల్ అవుతుండగా, పలువురు నెటిజన్లు మీకు ఏజ్ పెరిగినప్పటికీ కూడా మీ కూతురితో కలిసి ఎంతో చక్కగా ఆ సాంగ్ కి డాన్స్ చేసారు అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: