గత ఏడాది ఇస్మార్ట్ శంకర్  తో కెరీర్ లో మొదటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు ఎనర్జిటిక్  హీరో రామ్ .. ఇక ఈసినిమా తరువాత  కొంచెం గ్యాప్ తీసుకొన్న రామ్, రీమేక్ కు ఓకే చెప్పాడు. ఆసినిమానే రెడ్. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం కు రీమేక్  గా తెరకెక్కతున్న ఈ చిత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఇటలీ లో రెండు పాటలను చిత్రీకరించారు. త్వరలో హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇక  రేపటినుండి ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు. 
 
అందులో భాగంగా రేపు రెడ్ టీజర్ లేదా లిరికల్ సాంగ్ కు సంబందించిన అప్డేట్ రానుందని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన మాళవిక శర్మ, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా బిగిల్ ఫేమ్ అమ్రితా అయ్యర్ కీలక పాత్రలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ స్రవంతి  మూవీస్ బ్యానర్ పై  స్రవంతి రవి కిషోర్  నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలకానుంది. 
 
ఇక రామ్ - కిషోర్ తిరుమల కాంబోలో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన   నేను శైలజ సూపర్  హిట్ అవ్వగా  ఉన్నది ఒకటే జిందగీ అంచనాలను అందుకోలేకపోయింది. మరి రెడ్ వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇదిలాఉంటే ఈ చిత్రం తరువాత  రామ్ ఇంతవరకు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం రామ్, నెక్స్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించనున్నాడని టాక్. ప్రస్తుతం అనిల్, రామ్ కోసం కథను సిద్ధం చేసే పనిలో వున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: