టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొద్దిరోజుల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా నిజానికి తొలిరోజు యావరేజ్ టాక్ ని అందుకున్నప్పటికీ, సినిమాలో చాలా రోజుల తరువాత మహేష్ బాబు పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ పాత్రలో నటిచడంతో పాటు, సంక్రాంతి సీజన్ వలన వరుసగా సెలవలు రావడంతో సరిలేరు కలెక్షన్స్ దుమ్ము దులిపింది. ఇక ఆ సినిమా సక్సెస్ తరువాత తన ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెళ్లి ఇటీవల తిరిగి వచ్చిన మహేష్ బాబు, ప్రస్తుతం తన తదుపరి సినిమా విషయమై కథలు వినే పనిలో నిమగ్నం అయి ఉన్నారు. 

 

అయితే కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన అతిథి సినిమా ప్రస్తావన నేడు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. కాగా దానికి ఒక కారణం ఉందని అంటున్నారు. అదేమిటంటే, అతి త్వరలో మహేష్ బాబు అతిథి దర్శకుడు సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల వార్తలు రావడంతో, ఆయన ఫ్యాన్స్ మాత్రం బాబోయ్ ఆయనతో సినిమా వద్దే వద్దు అని అంటున్నారు. 2007లో వచ్చిన అతిథి సినిమాలో మహేష్ బాబు తన లుక్, స్టైల్, మ్యానరిజమ్స్ ని చేంజ్ చేసి ఎంతో అద్భుతంగా నటించడం జరిగింది. అయితే సినిమాలోని కథ, కథనాల్లో సరైన బలం లేకపోవడంతో అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా అపజయం పాలయింది. 

 

కావున ఆ సినిమాతో తమ హీరో ఇమేజ్ కి సురేందర్ రెడ్డి ఇచ్చింది మాములు స్ట్రోక్ కాదు మాస్టర్ స్ట్రోక్ అని, కావున ఆయన దర్శకత్వంలో మహేష్ సినిమా చేయకూడదని వారు కోరుతూ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే తన తదుపరి సినిమాని మహేష్, వంశీ పైడిపల్లితో చేస్తారని ముందుగా వార్తలు రావడం, అలానే నిన్నటి నుండి ఆ సినిమా క్యాన్సిల్ అయిందంటూ ప్రచారం అవుతుండడంతో, ఆ వెంటనే పరశురామ్ తో పాటు సురేందర్ రెడ్డి కూడా మహేష్ కు ఒక కథ వినిపించారని అంటున్నారు. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు గాని, అది విన్న తమవరకు చేరడంతో,  విన్న మహేష్ ఫ్యాన్స్, సురేందర్ రెడ్డితో ఎప్పటికీ సినిమా మాత్రం చేయవద్దని కోరుతూ ఇంకా తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు...!!  

మరింత సమాచారం తెలుసుకోండి: