సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా హిట్ అన్న టాక్ తప్ప బ్లాక్ బస్టర్ అని మహేష్ రేంజ్ లో చెప్పుకునేలా నిలవలేకపోయింది. ఈ సినిమాతో పాటు రిలీజైన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి రికార్డ్స్ ని నెలకొల్పింది. ఆ సినిమాతో పోల్చుకుంటే సరిలేరు కలెక్షన్స్ పరంగా తక్కువేనని చెప్పాలి. అదీ గాక మహేష్సినిమా మీద గట్టి నమ్మకంతో ముందు అనుకున్న డైరెక్టర్స్ ని పక్కన పెట్టి మరీ అనిల్ రావిపూడితో కమిటయ్యాడు. 

 

కాని ఈ సినిమా సూపర్ స్టార్ రేంజ్ లో లేదని మహేష్ సరిలేరు సినిమా విషయంలో రాంగ్ స్టెప్ వేశారని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఇక హీరోయిన్ రష్మిక కూడా సినిమాకి పెద్ద మైనస్ అన్న మాట వినిపించింది. దాదాపు 13 ఏళ్ళ తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆవిడ పాత్ర కూడా సినిమా హిట్ కి అంతగా ఉపయోగపడలేదు. ఇక అన్నిటికంటే ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఎప్పుడు సినిమాకి దేవిశ్రీ మ్యూజిక్ పెద్ద ఎస్సెట్ గా నిలుస్తుంది. అలాంటిది ఈసారి సూపర్ స్టార్ సినిమాకి పెద్ద మైనస్ అని తేలిపోయింది.

 

దాంతో ఈ సారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలన్న పంథం తో సూపర్ స్టార్ ఉన్నారు. అందుకే మహర్షి వంటి క్లాస్ సినిమాని తీసి మహేష్ కి హిట్టిచ్చిన వంశీ పైడిపల్లి తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. త్వరలో సెట్స్ మీదకి వెళుతుందనుకుంటడగా ఈ సినిమా గురించి రక రకాల వార్తలు వచ్చి మహేష్ ఫ్యాన్స్ ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. అయితే అసలు వాస్తవం ఏంటంటే వంశీ పైడిపల్లి ఇటీవల మహేష్ బాబు కి స్క్రిప్ట్ వినిపించారు.

 

మొత్తం స్క్రిప్ట్ విన్న మహేష్ బాగా డిసప్పాయింట్ అయ్యారట. అసలు ఇలా ఉంటుందని బాబు ఎక్స్పెక్ట్ చేయలేదట. అందుకే ఏంటి వంశీ ఇలాంటి స్క్రిప్ట్ తో సినిమా చేస్తానని ఎలా వచ్చావ్ ..అందరిని కాదని నీకిస్తే ఇదేనా .. నాకసలు నచ్చలేదు వెళ్ళి మార్చుకురా ..! చెప్పాడట. ప్రస్తుతం మహేష్ బాబు అమెరికాలో మోకాలి శస్త్ర చికిత్స కోసం వెళ్ళారు. మే మొదటి వారంలో తిరిగి ఇండియాకి వస్తారు. ఆ తర్వాతే కొత్త సినిమా సంగతులు వెల్లడి కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: