టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా కథల ఎంపిక విషయమై నిమగ్నం అయి ఉన్నారు. తనతో గతంలో మహర్షి వంటి సూపర్ హిట్ మూవీని తీసిన వంశీ పైడిపల్లితో మహేష్ బాబు తన తదుపరి సినిమా చేస్తారనే వార్తలు ఇటీవల హల్ చల్ చేయడంతో పాటు, మహేష్ కూడా వంశీ తో నెక్స్ట్ సినిమా ఉంటుందని అన్నారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా కథ పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని, అందువలన వేరొక దర్శకుడితో మహేష్ సినిమా చేయనున్నారని అంటున్నారు. 

 

అయితే వారిలో గీత గోవిందం దర్శకుడు పరశురాం పెట్ల పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తుండడంతో, మహేష్ నెక్స్ట్ మూవీ ఆయనతోనే అంటూ వార్తలు కూడా గట్టిగా ప్రచారం అవుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి తన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు టాక్. ఇక ఆ విషయం అటుంచితే, నేడు ఒక యాడ్ షూట్ కోసం ముంబై బయల్దేరి వెళ్ళిన సూపర్ స్టార్ మహేష్ బాబు, నేటి ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియా వారి కంటపడ్డారు. 

 

పసుపు రంగు షర్ట్, ఆకుపచ్చ పచ్చ కలర్ క్యాప్, నలుపు రంగు కళ్లద్దాలు పెట్టుకుని ఉన్న తనను మీడియా వారు అదేపనిగా ఫోటోలు తీస్తుండడం గమనించిన మహేష్, అటు వైపుగా వెళుతూ, ఆపు బాబు ఆపు, మీకు బోర్ కొట్టడం లేదా, ఎప్పుడూ ఇదే పనా అని సరదాగా మాట్లాడుతూ వెళ్లారు. అయితే అదే సమయంలో వారిలోని ఒక మీడియా వ్యక్తి, సర్ ఇప్పుడే వచ్చానండి అని చెప్పం జరిగింది. ఇక ఈ మొత్తం ఘటన అంతా కూడా వీడియో రికార్డు అవడం, అలానే దీనిని కొందరు యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. మంచి కామెడీ టైమింగ్ తో మహేష్ పలికిన ఆ డైలాగ్ వీడియో ప్రస్తుతం అటు సోషల్ మీడియా మాధ్యమాలతో పాటు, ఇటు యూట్యూబ్ లో కూడా వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: