తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం విశ్వాసం ఫేమ్ శివ డైరెక్షన్ లో తన 168 వ చిత్రంలో నటిస్తున్నాడని తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్  కంప్లీట్ కాగా రెండో షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో  జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా అలనాటి హీరోయిన్లు  మీనా ,కుష్బూ తోపాటు కీర్తి సురేష్  ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా నరసింహ తరువాత ప్రకాష్ రాజ్ ,రజినీకాంత్ తో కలిసి నటించడం ఇది రెండో సారి. ఇక ఈ చిత్రానికి టైటిల్ ను ఖరారు చేశారు. 
 
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అన్నాతే అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మరి తెలుగులో ఈ సినిమాకు ఏ టైటిల్ ను పెడతారో చూడాలి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. జులై లో ఈ చిత్రాన్ని విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రం తరువాత రజినీ, ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో నటించనున్నాడని టాక్. కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. 
 
ఇక ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి రజినీ కాంత్ , దర్బార్ తో ప్రేక్షకులముందుకు రాగ ఈచిత్రం తమిళ్ తోపాటు తెలుగులో భారీ నష్టాలను మిగిల్చింది. మురగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం కేవలం రజినీ అభిమానులను మాత్రమే మెప్పించడం తో విజయం సాధించలేకపోయింది. తెలుగులో ఈ సినిమా 5కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్  నిర్మించగా  నయనతార హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: