పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వటం జరిగింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' సినిమాని రీమేక్ చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి వకీల్ సాబ్, లాయర్ సాబ్ అనే టైటిల్స్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. జనవరి నెలలో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ కాగా … సినిమాకి సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇటీవల  WeWantPSPK26Update అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేయటం స్టార్ట్ చేశారు. కానీ ఈ సినిమా యూనిట్ నుండి ఎటువంటి స్పందన ఇప్పటివరకు రాలేదు. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయినా తమన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టాడు.

 

విషయంలోకి వెళితే ఇటీవల పవన్ కళ్యాణ్ ని తమన్ కలవటంతో అది కూడా ఫస్ట్ టైం అవటంతో తీవ్ర భావోద్వేగానికి గురై పవన్ పై తనకి ఉన్న అభిమానాన్ని ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తమన్ పెట్టిన పోస్ట్ ఏమిటంటే... 'ఇది అద్భుతమైన రోజు. నేను కలవాలని, ఆయన చిత్రాలకు సంగీతం అందించాలని కలలు కన్న వ్యక్తిని కలిశాను. నేను కంపోజ్ చేసిన పాటలని ఆయనకు వినిపించాను. ఆ సమయంలో టెన్షన్ కు గురయ్యా. ఆయనపై ఉన్న ప్రేమ నేను ఒత్తిడికి గురయ్యేలా చేసింది.

 

కానీ ఆయన కూడా నాపై ప్రేమాభిమానాలు చూపించారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ తో రాబోతున్నాం' అని తమన్ ప్రకటించాడు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాని మ్యూజికల్ హిట్ గా తమన్ నిలబెట్టడంతో ఆ  సినిమాలో ‘సామజ వరగమన’ సాంగ్ సినిమాకే హైలెట్ అవ్వటంతో ప్రస్తుతం పవన్ తో చేస్తున్న సినిమాలో ఆ స్థాయిలో సాంగ్ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: