అందాల తార శ్రీదేవి మరణించి నిన్నటికి సరిగ్గా 2 సంవత్సరాలు అయ్యింది. దీంతో ఎంతో మంది అభిమానులు నిన్న ఆమెను గుర్తు చేసుకున్నారు.. శ్రీదేవి అంటే ఒక్క భారతీయులకే కాదు.. విదేశీయులకు కూడా శ్రీదేవి అంటే ఎంతో ఇష్టం.. ఇకపోతే శ్రీదేవి మాటను లెక్క చెయ్యకుండా ఆమె ఆత్మను బాధిస్తున్నారు అని వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఆ వార్తలు ఏంటి అనుకుంటున్నారా? 

 

అక్కడికే వస్తున్న.. శ్రీదేవి నటించిన ఎన్నో సినిమాల్లో ఓ అద్భుతమైన సినిమా 'మిస్టర్ ఇండియా'.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ సినిమా ప్రతిఒక్కరికి గుర్తు ఉంటుంది. అంత గొప్ప సినిమామిస్టర్ ఇండియా. అనిల్ కపూర్, శ్రీదేవి, అమ్రిష్ పూరీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించగా శేఖర్ కపూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

 

సినిమా అప్పట్లో క్లాసిక్ బ్లాక్ బస్టర్. అయితే అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయినా సినిమాలను ఇప్పుడు సీక్వెల్స్ పేరుతో ఎలా అంటే అలా ఆ సినిమాలను తీస్తున్నారు.. అలా తీసిన చాలా సీక్వెల్ సినిమాలు ఏవీ పెద్దగా సూపర్ హిట్ అవ్వలేదు.. అయితే రెండేళ్ల క్రితమే మిస్టర్ ఇండియా సినిమాకు సీక్వెల్ తియ్యాలని అనుకున్నారు. 

 

అయితే అప్పట్లో శ్రీదేవి నిరాకరించారు.. ఇలాంటి గొప్ప సినిమాలను సీక్వెల్స్ పేరుతో మళ్లీ తియ్యకపోతేనే మంచిది అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ అవి ఏవి పట్టించుకోకుండా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ ''మిస్టర్ ఇండియా ట్రైలాజీ'' అంటూ సీక్వెల్ తీస్తున్నట్టు ప్రకటించారు. 

 

త్వరలోనే ఈ సినిమాలోని నటీనటులను ప్రకటిస్తా అంటూ ఆయన ట్విట్ చేశారు. దీంతో కొందరు సర్ప్రైజ్ అవుతే.. మరికొందరు ఆ డైరెక్టర్ పై ఫైర్ అయ్యారు.. అలా ఫైర్ అయినా వారిలో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ఒకరు.. ''ఈ సినిమా సీక్వెల్‌ను ప్రకటించేముందు మా నాన్న అనుమతి కానీ దర్శకుడు శేఖర్ కపూర్ అనుమతి కానీ తీసుకోలేదు. ఇది గౌరవం అనిపించుకోదు. మొన్ననే బోనీ కపూర్, మా నాన్న కలిసి చర్చించుకున్నారు. ఈ సినిమా రైట్స్ శేఖర్ కపూర్ వద్దే ఉన్నాయి'' అని ఆమె ఆగ్రహంతో ట్విట్ చేశారు.

 

ఒక్క సోనమ్ కపూర్ ఏ కాదు.. నెటిజన్లు కూడా దర్శకుడిపై ఫైర్ అవుతున్నారు.. శ్రీదేవిసినిమా సీక్వెల్ వద్దు.. తీయ్యద్దు అని చెప్పిన.. ఆ సినిమాతో సంబంధం లేని దర్శకుడు సీక్వెల్ ప్రకటించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు.. అసలు శ్రీదేవి మాట అంటే లెక్కలేదా.. మనిషి చనిపోతే వారి మాటలను కూడా గాలికి వదిలేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరి ఈ ప్రశ్నలకు అలీ అబ్బాస్ ఎం చెప్తాడో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: