వంశీ పైడిపల్లి మహేష్మూవీ ప్రాజెక్ట్ ఊహించని విధంగా క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు మహేష్ ఇంటి చుట్టూ అనేకమంది దర్శకులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మహేష్ కు కథలు వినిపించిన దర్శకుల పేర్లలో పరుశు రామ్ పేరు మహేష్ చేయబోయే సినిమాకు దర్శకుడుగా వినిపిస్తోంది. 

 

ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ప్రవీణ్ సత్తార్ పేరు వెలుగులోకి రావడంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు మహేష్ అభిమానులు కూడ షాక్ అవుతున్నారు. వెరైటీ కథలను క్రియేట్ చేయడంలో ప్రవీణ్ సత్తార్ కు మంచి పేరు ఉన్నా అతడు తీసిన సినిమాలు పెద్దగా ఘన విజయం సాధించలేదు. ఇతడు దర్శకత్వం వహించిన ‘గుంటూర్ టాకీస్’ ‘చందమామ కథలు’ సినిమాలకు మంచి ప్రశంసలు లభించాయి కానీ ఆ మూవీలు ఘోరమైన ఫ్లాప్ గా మారాయి. 

 

ఇలాంటి పరిస్థితులలో ఈ దర్శకుడు వరస పరాజయాలతో కూరుకు పోతున్న రాజశేఖర్ తో ‘గరుడవేగ’ మూవీని తీసి కొంత వరకు రాజశేఖర్ కు ఫ్లాప్ ల గండం నుంచి గట్టెక్కించినా ఆ మూవీ కూడ చెప్పుకోతగ్గ హిట్ కాదు. ఇలాంటి పరిస్థితులలో మహేష్ అమెరికా వెళ్లకముందు ఈ దర్శకుడు మహేష్ కు చెప్పిన కథ అతడికి సుమారు 30 శాతం వరకు నచ్చింది అని టాక్. ఇప్పుడు వంశీ పైడిపల్లి మూవీ అటకెక్కడంతో ఎలర్ట్ అయిన మహేష్ తనకు గతంలో కథలు వినిపించిన దర్శకులు అందరికీ మళ్ళీ కలవవలసిందిగా తన టీమ్ ద్వారా వర్తమానం పంపినట్లు వార్తలు వస్తున్నాయి. 

 

ఇప్పుడు ఈ వర్తమానం ప్రవీణ్ సత్తార్ కు కూడ చేరడంతో అతడు ఇంకా తన వద్ద ఉన్న రెండు మూడు కథలను కూడ మహేష్ కు వినిపించే విధంగా ప్రిపేర్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్తలు ఇలా వైరల్ కావడంతో వంశీ పైడిపల్లి గండం తప్పింది అంటూ తాము ఆనంద పడుతూ ఉంటే ఇప్పుడు అతడి స్థానంలో ప్రవీణ్ సత్తార్ వచ్చి చేరడం ఏమిటి అంటూ మహేష్ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతూ ఈ కాంబినేషన్ కూడ సెట్ కాకూడదు అని ఆశ పడుతున్నట్లు టాక్..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: