బాలీవుడ్ హీరోయిన్లు ప్రేమల విషయంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే వాళ్ళు నడిపే ప్రేమాయణాల పైనే బాలీవుడ్ మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని నిజం. ఇక ప్రేమ కథల విషయానికి వస్తే... ఆ నాటి నుంచి ఈ నాటి వరకు కూడా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లు చాలా మంది ప్రేమ కథలు నడిపారు. అయితే ఈ తరంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు దీపిక పదుకొనే. ఆమె ప్రేమ కథలు ఒకప్పుడు మీడియా ను షేక్ చేసాయి. 

 

ప్రకాష్ పదుకొనే కూతురుగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన దీపిక ఆ తర్వాత మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు ప్రేమ కథలతో కూడా తెచ్చుకుంది. ముందు నిహార్ పాండ్యా తో ప్రేమలో పడిన దీపిక... ఆ తర్వాత అతనికి గుడ్ బై చెప్పి ఉపేన్ పటేల్ అనే మోడల్ తో ప్రేమలో పడింది దీపిక. ఆ తర్వాత అప్పుడే టీం ఇండియాలో కి అడుగుపెట్టిన క్రికెటర్ ఎమ్మెస్ ధోనీతో ప్రేమలో పడింది. అదే సమయంలో దీపిక యువరాజ్ సింగ్ తో కూడా ప్రేమాయణం నడిపింది. యువరాజ్ సింగ్ కెరీర్ అర్ధంతరంగా పడిపోవడానికి దీపిక నే కారణం అనేది చాలా మంది మాట. 

 

ఆ తర్వాత క్రికెటర్లకు గుడ్ బై చెప్పి రణబీర్ కపూర్ తో లవ్ స్టొరీ స్టార్ట్ చేసింది. ఇద్దరూ కలిసి మంచి సినిమాలు కూడా చేస్తూ వచ్చారు. ఏమైందో ఏమో పెళ్లి చేసుకుంటారు అనుకున్న తరుణంలో విడిపోయారు. ఆ తర్వాత వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్దార్థ్ మాల్యా తో ప్రేమలో పడింది. లండన్ లో అతను ఆమెకు ఒక ఫ్లాట్ కూడా కొనివ్వడం అప్పట్లో మీడియాలో హైలెట్. కొన్ని రోజులకే... ముజామిల్ ఇబ్రహి౦ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. చివరికి హీరో రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: