బాలకృష్ణ బోయపాటి ల లేటెస్ట్ మూవీ ప్రారంభోత్సవం జరుపుకుని నెలలు గడిచిపోతున్నా ఈ మూవీ షూటింగ్ ప్రారంభానికి రకరకాల సమస్యలు అడ్డుపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య మార్కెట్ పడిపోవడంతో ఈ మూవీకి ఏర్పడిన బడ్జెట్ సమస్యలతో పాటు హీరోయిన్స్ సమస్య కూడ విపరీతంగా ఎదురైంది.


ఈ మూవీలో కథ రీత్యా ఇద్దరు బాలయ్యలు ఉంటారని ఒక బాలయ్య కాశి లోని అఘోరాల మధ్య పెరుగుతాడని ఇప్పటికే లీకులు వచ్చాయి. అయితే అఘోరాలు చాల భయంకరమైన లుక్ తో గోచీ పెట్టుకుని గుండు చేయించుకుని పెరిగిన గెడ్డం తో చాల డిఫరెంట్ గా కనిపిస్తూ ఒళ్ళంతా వీభూది పూసుకుని చూసేవారు భయపడేలా ఉంటారు. 


ఈ మూవీలో బాలయ్య అఘోరా లా కనిపించడానికి ఇప్పటికే గుండు చేయించుకుని తన లుక్ కు మానసికంగా సిద్ధపడుతున్నారు. ఇప్పుడు త్వరలో కాశిలో షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ మూవీలో బాలయ్యను గోచీ తో చూపించాలా లేదంటే గుండుతో కాషాయం కట్టి సన్యాసి వేష ధారణలో చూపించాలా అనే విషయమై బాలయ్య బోయపాటిల మధ్య చాల లోతైన చర్చలు జరుగుతున్నట్లు టాక్. 


బాలకృష్ణ ను వెండితెర పై ఇలా గోచీ గెటప్ లో చూపించదానికి బోయపాటి భయపడిపోతూ ఉంటే బాలయ్య మాత్రం అఘోరా పాత్రను వాస్తవికంగా తీయమని ఎటువంటి రాజీలు పడవద్దని బోయపాటికి సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి భారీ పారితోషికాలు ఆఫర్ చేస్తున్నా చాలామంది వెనక్కు వెళ్ళి పోవడానికి గల కారణం ఈ మూవీలో హీరోయిన్ ఒక పిల్ల తల్లిగా ఉండడం అన్న పాయింట్ అని అంటున్నారు. ఎట్టకేలకు ఈ మూవీలో నటించడానికి అంజలిని ఒప్పించడానికి స్వయంగా బాలయ్య రంగంలోకి దిగవలసి వచ్చింది అన్న వార్తలు కూడ ఉన్నాయి. ఈ మూవీలో అంజలి జిల్లా కలెక్టర్ గా చాల పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుంది అని అంటున్నారు..     

 

మరింత సమాచారం తెలుసుకోండి: