తెలుగు ఇండస్ట్రీలో ఎంతో సౌమ్యూడిగా పేరు తెచ్చుకున్నారు మహేష్ బాబు.  శ్రీమంతుడు  తర్వాత వరుస విజయాలు అందుకుంటూ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నారు.  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.  సాధారణంగా మహేష్ బాబు ఏ చిత్రం సక్సెస్ అయినా.. కాకున్నా విదేశీ టూర్లకు వెళ్లడం కామన్ అని తెలిసిందే.  సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు ఏ చిత్రంలో నటిస్తారన్న విషయం పై క్లారిటీ రాలేదు.  వాస్తానికి వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ సరిగా లేని కారణంగా ఆ కథలో మార్పులు చేర్పులు చేయాలని సూచించినట్లు తెలుగుస్తుంది. 

 

ఆ తర్వాత మహేష్ బాబు ‘గీతాగోవిందం’ డైరెక్టర్ పరుశరామ్ ని లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది ఏ డైరెక్టర్ తో వస్తారన్న విషయంపై ఇంకా చర్చలు నడుస్తున్నాయి.  ఇక మహేష్ బాబు ఎంత సౌమ్యూడో అంతే హ్యూమరీజం ఉన్న వ్యక్తి.  ఆయన నటించిన ఖలేజా ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు లాంటి చిత్రాలు చూస్తుంటే అర్థం అవుతుంది.  ఎప్పుడు సీరియస్ లుక్ తో ఉండే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ తో కడుపుబ్బా నవ్వించారు.   అభిమానులతోనూ ఆయన అలాగే కనిపిస్తుంటారు. తాజాగా ఓ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన ఇప్పుడు వైరల్ అయింది.

 

తనను పదేపదే ఫోటో తీస్తున్న ఓ అభిమానిపై చిరుకోపాన్ని నటిస్తూ, మహేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మహేశ్ కారు దిగి విమానాశ్రయంలోకి నడిచి వస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి మహేష్ బాబు ని తదేకంగా ఫోటోలు తీస్తూ వస్తున్నారు.  దాంతో చిర్రెత్తుకొచ్చిన  మహేష్ బాబు  దీంతో "ఆపమ్మా ఆపు... నీకు బోర్ కొట్టట్లేదా?... ఎప్పుడూ ఇదే పనా" అంటూ తనదైన శైలిలో అనడంతో అక్కడున్న సిబ్బందితో పాటు కెమెరామెన్ కూడా పెద్దపెట్టున నవ్వారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: