సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్‌ పాపులర్‌ లవ్‌ స్టోరిస్‌ నయనతారవే. కెరీర్ స్టార్టింగ్‌ లోనే ప్రేమ వ్యవహారాలు మొదలు పెట్టిన ఈ బ్యూటీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. హీరోయిన్‌గా సెటిల్ అవుతున్న సమయంలోనే అప్పటి యంగ్ హీరో శింబుతో ప్రేమలో పడింది. వీరి ప్రేమ వ్యవహారం చాలా దూరమే వెళ్లింది. ఇక పెళ్లి పీటలెక్కుతారనుకుంటున్న తరుణం ఇద్దరూ బ్రేకప్‌ చెప్పేసుకున్నారు.

 

కొంతకాలానికి మరోసారి ప్రేమలో పడింది ఈ బ్యూటీ. సీనియర్ హీరో, కొరియాగ్రఫ్‌ ప్రభుదేవకు దగ్గరైంది. విజయ్‌ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విల్లు సినిమా షూటింగ్‌ సమయంలో నయన్‌, ప్రభుల మధ్య ప్రేమ చిగురించింది. చాలా కాలం వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. నయన్‌తో వ్యవహారం కారణంగా ప్రభుదేవా తన భార్యకు కూడా దూరమయ్యాడు, విడాకులు కూడా తీసుకున్నాడు. ప్రభుదేవాతో వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకున్న నయన్‌, సినిమాలకు గుడ్‌ బై చెపుతున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది.

 

ఇక పెళ్లి చేసుకోవటమే అనుకుంటున్న తరుణంలో ప్రభుదేవాతోనూ బ్రేకప్‌ చెప్పేసింది. ఈ పరిణామం నయన్‌ను మానసికంగా చాలా దెబ్బ తీసింది. దీంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఆ సమయంలోనే విఘ్నేష్‌ శివన్‌ ఆమెకు దగ్గరయ్యాడు. తన సినిమాలో హీరోయిన్‌గా నయన్‌ను సెలెక్ట్ చేసుకున్న విఘ్నేష్ కథాచర్చలు జరుపుతున్న సమయంలోనే ఆమెకు దగ్గరయ్యాడు. ఆ సమయంలో డిప్రెషన్‌లో ఉన్న నయన్‌కు ఓదార్పునిచ్చాడు.

 

అలా వారి బంధం ప్రేమకు దారితీసింది. ప్రస్తుతం ఈ జంట ఖాళీ సమయాల్లో చెట్టాపట్టాలేసుకొని విదేశీ టూర్లుకొట్టేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు బ్రేకప్‌ అయిన నయన్‌, విఘ్నేష్‌తో ప్రేమ విషయంలో మెచ్యూర్డ్‌గా ఉంటోంది. ప్రస్తుతం నయనతార చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. నేట్రికమ్‌, మూక్తి అమ్మాన్‌, అన్నత్తే, కాతువాకుల రెండు కాదల్‌ సినిమాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: