తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈ సినిమా… దీపావళి కానుకగా అక్టోబ 25న రిలీజ్ ఉదయం ఆట నుంచే దుమ్ము దులిపింది. తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్తో పాటు తెలుగు ఆడియన్స్ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. సూర్య నటిస్తున్నసినిమాలకు తెలుగు లో ఎంత ఆదరణ ఉందో ఆయన తమ్ముడు కార్తీ నటిస్తున్న సినిమాలకు కూడా అంతే ఆదరణ ఉంటుంది.
ఈమధ్య దక్షిణాది సినిమాలు ఉత్తరాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే పెద్దపెద్ద బాలీవుడ్ హీరోలు సైతం ఆ సినిమాల రీమేక్లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో పలు సినిమాలు బాలీవుడ్ లోకి రిమేక్ అయిన విషయం తెలిసిందే. కార్తీ హీరోగా వచ్చిన తమిళ మూవీ ‘ఖైదీ’ మంచి విజయం సాధించడంతో ఆ సినిమాను బాలీవుడ్లో రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ, డ్రీమ్ వారియర్స్తో కలిసి రీమేక్ చేసే పనిలో పడింది. ఈ సినిమాలో కండల వీరుడు సల్మాన్ హీరోగా చేస్తున్నారని.. కాదుకాదు.. హృతిక్రోషన్ ఇప్పటికే ఖరారైపోయారని గతంలో వార్తలు వినిపించాయి. సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. అందులో కథానాయకుడిగా అజయ్దేవ్గణ్ చేస్తున్నట్లు సమాచారం.
చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే ఆయనను సంప్రదించగా దానికి ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ అనకున్నప్పటికీ ఈ అవకాశం అజయ్ దేవగాన్ ఎగరేసుకు పోయాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ హీరో వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఖైదీ రిమేక్ విషయంపై హిందీలోనూ కథ విన్నారట. ఈ సినిమాలో అజయ్ హీరోగా చేసేందుకు సంతకం చేసినట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది.అజయ్దేవగణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్2, హిందీలో మైదాన్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.